కువైట్ పాఠశాలల్లో ఫాస్ట్ ఫుడ్పై నిషేధం
- March 07, 2023
కువైట్: కువైట్ పాఠశాలల్లో ఫాస్ట్ ఫుడ్పై నిషేధం విధించారు. ఈ మేరకు ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీస్ అండర్ సెక్రటరీ డాక్టర్ ఘనేమ్ అల్-సులైమానీ తెలిపారు. పాఠశాలల్లో ఫాస్ట్ ఫుడ్ ఉత్పత్తులను నిషేధిస్తూ సోమవారం పబ్లిక్ మెమోను విడుదల చేశారు. “ఇది మా విద్యార్థుల ప్రయోజనాల కోసం.. సాధారణ ఆహార అథారిటీ ద్వారా నిర్దేశించిన ఆరోగ్యకరమైన ప్రమాణాల కోసం నియంత్రణ విధించాం. ఫాస్ట్ ఫుడ్ ఉత్పత్తులలో పెద్ద మొత్తంలో కొవ్వులు, అధిక కేలరీలు ఉంటాయి. పోషకాలు లేనివి, ఇది తీవ్రమైన ఆరోగ్య నష్టాలను కలిగిస్తుంది. ”అని మెమోలో పేర్కొన్నారు. మెమోలను ఇప్పటికే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కిండర్ గార్టెన్లకు పంపినట్లు అల్-సులైమానీ తెలిపారు. అందరూ నిబంధనలకు కట్టుబడి, డెలివరీ కంపెనీలను పాఠశాలల్లోకి ప్రవేశించకుండా నిరోధించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







