కువైట్ పాఠశాలల్లో ఫాస్ట్ ఫుడ్పై నిషేధం
- March 07, 2023
కువైట్: కువైట్ పాఠశాలల్లో ఫాస్ట్ ఫుడ్పై నిషేధం విధించారు. ఈ మేరకు ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీస్ అండర్ సెక్రటరీ డాక్టర్ ఘనేమ్ అల్-సులైమానీ తెలిపారు. పాఠశాలల్లో ఫాస్ట్ ఫుడ్ ఉత్పత్తులను నిషేధిస్తూ సోమవారం పబ్లిక్ మెమోను విడుదల చేశారు. “ఇది మా విద్యార్థుల ప్రయోజనాల కోసం.. సాధారణ ఆహార అథారిటీ ద్వారా నిర్దేశించిన ఆరోగ్యకరమైన ప్రమాణాల కోసం నియంత్రణ విధించాం. ఫాస్ట్ ఫుడ్ ఉత్పత్తులలో పెద్ద మొత్తంలో కొవ్వులు, అధిక కేలరీలు ఉంటాయి. పోషకాలు లేనివి, ఇది తీవ్రమైన ఆరోగ్య నష్టాలను కలిగిస్తుంది. ”అని మెమోలో పేర్కొన్నారు. మెమోలను ఇప్పటికే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కిండర్ గార్టెన్లకు పంపినట్లు అల్-సులైమానీ తెలిపారు. అందరూ నిబంధనలకు కట్టుబడి, డెలివరీ కంపెనీలను పాఠశాలల్లోకి ప్రవేశించకుండా నిరోధించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









