కువైట్ పాఠశాలల్లో ఫాస్ట్ ఫుడ్పై నిషేధం
- March 07, 2023
కువైట్: కువైట్ పాఠశాలల్లో ఫాస్ట్ ఫుడ్పై నిషేధం విధించారు. ఈ మేరకు ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీస్ అండర్ సెక్రటరీ డాక్టర్ ఘనేమ్ అల్-సులైమానీ తెలిపారు. పాఠశాలల్లో ఫాస్ట్ ఫుడ్ ఉత్పత్తులను నిషేధిస్తూ సోమవారం పబ్లిక్ మెమోను విడుదల చేశారు. “ఇది మా విద్యార్థుల ప్రయోజనాల కోసం.. సాధారణ ఆహార అథారిటీ ద్వారా నిర్దేశించిన ఆరోగ్యకరమైన ప్రమాణాల కోసం నియంత్రణ విధించాం. ఫాస్ట్ ఫుడ్ ఉత్పత్తులలో పెద్ద మొత్తంలో కొవ్వులు, అధిక కేలరీలు ఉంటాయి. పోషకాలు లేనివి, ఇది తీవ్రమైన ఆరోగ్య నష్టాలను కలిగిస్తుంది. ”అని మెమోలో పేర్కొన్నారు. మెమోలను ఇప్పటికే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కిండర్ గార్టెన్లకు పంపినట్లు అల్-సులైమానీ తెలిపారు. అందరూ నిబంధనలకు కట్టుబడి, డెలివరీ కంపెనీలను పాఠశాలల్లోకి ప్రవేశించకుండా నిరోధించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!







