ఎక్స్‌పో 2023 దోహా టెక్ పార్టనర్‌గా మైక్రోసాఫ్ట్

- March 07, 2023 , by Maagulf
ఎక్స్‌పో 2023 దోహా టెక్ పార్టనర్‌గా మైక్రోసాఫ్ట్

దోహా: ఎక్స్‌పో 2023 దోహా టెక్ పార్టనర్‌గా మైక్రోసాఫ్ట్ వ్యవహరించనుంది. ఈ మేరకు మార్చి 6న కుదిరిన ఒక ఒప్పందంపై ఎక్స్‌పో 2023 దోహా, మైక్రోసాఫ్ట్ సంతకం చేశాయి.  మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్టోబర్ 2023, మార్చి 2024 మధ్య అల్ బిడ్డా పార్క్‌లో జరిగే ఈవెంట్‌లో అత్యంత అధునాతన సాంకేతికతలను ప్రదర్శించడానికి ఎక్స్‌పో 2023 దోహాకు మైక్రోసాఫ్ట్ సాయం అందిస్తుంది. ఈ సందర్భంగా దోహా ఎక్స్‌పో 2023 సెక్రటరీ జనరల్ మహమ్మద్ అలీ అల్-ఖౌరీ మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యానవన రంగాలు ప్రస్తుతం భారీ సాంకేతిక పరివర్తనకు గురవుతున్నాయని తెలిపారు. అత్యంత ముఖ్యమైన పర్యావరణ సవాళ్లను అధిగమించడంలో మాకు సహాయపడే స్థిరమైన వ్యవస్థలను నిర్మించడంలో సాంకేతికత పాత్ర కీలకం అన్నారు. ఎక్స్‌పో 2023 దోహా, ఖతార్ హోస్ట్‌లుగా సాంకేతికతతో నడిచే వ్యవసాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రపంచంలోని సాంకేతిక నాయకుడితో కలిసి పని చేయడం మాకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ తమ సుస్థిరత లక్ష్యాల సాధనను వేగవంతం చేయడానికి పరిశ్రమలలోని సంస్థలకు అందుబాటులో ఉన్న మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఫర్ సస్టైనబిలిటీ సొల్యూషన్‌లను ప్రదర్శిస్తుందని తెలిపారు.  ప్రపంచంలోనే అతిపెద్ద హార్టికల్చర్ ఎగ్జిబిషన్ అయిన ఎక్స్‌పో 2023 దోహాను నిర్వహిస్తున్నందుకు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖను మైక్రోసాఫ్ట్ ఖతార్ జనరల్ మేనేజర్ లానా ఖలాఫ్ అభినందించారు. వ్యవసాయం, ఉద్యానవనం, సహజ వనరుల పరిరక్షణ రంగాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తమ AI- ఆధారిత పరిష్కారాలను ప్రదర్శించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎక్స్‌పో 2023 దోహాకు మూడు మిలియన్ల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. ఎడారీకరణ, ఆహార భద్రత, నీటి లభ్యత వంటి ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న ప్రధాన పర్యావరణ సమస్యలను చర్చించడానికి.. పరిష్కరించడానికి ఒక వేదికగా ఇది నిలువనుంది. ఇది అక్టోబర్ 2, 2023 నుండి మార్చి 28, 2024 వరకు 179 రోజుల పాటు కొనసాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com