సాయిధరమ్ తేజ్ 'సుప్రీమ్' సినిమాను మెచ్చిన చిరు!
- May 04, 2016
పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల తరువాత మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన మూవీ సుప్రీమ్. ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న రాత్రి స్పెషల్ షో చూశారు. ఈ విశేషాలపై సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. తన లేటెస్ట్ మూవీ 'సుప్రీమ్'ను మావయ్య చిరంజీవి నిన్న రాత్రి చూసి ఎంజాయ్ చేశారని పేర్కొంటూ తన ఆనందాన్ని అభిమానులతో సాయి ధరమ్ పంచుకున్నాడు. ఈరోజు విడుదలవుతున్న తన మూవీ సక్సెస్ అవ్వాలని చిరంజీవి తనను, మూవీ యూనిట్ ను ఆశీర్వదించారని చెప్పాడు. అందుకు మామ చిరుకు ధన్యవాదాలు తెలుపుతూ యంగ్ హీరో ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.సాయిధరమ్తేజ్, రాశీ ఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన 'సుప్రీమ్' నేడు విడుదల కానున్న విషయం తెలిసిందే. చిరంజీవి హిట్ మూవీ 'యముడికి మొగుడు'లోని పాపులర్ సాంగ్ 'అందం హిందోళం... అధరం తాంబూలం...' ఇందులో రీమిక్స్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటుందని సాయి ధరమ్ తో పాటు యూనిట్ భావిస్తోంది. ఈ మూవీ అందర్నీ అలరించే ఓ మాస్ ఎంటర్టైనర్. వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని యూనిట్ చెబుతోంది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని భావించినా, భారీ సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేయక తప్పలేదు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







