సాయిధరమ్ తేజ్ 'సుప్రీమ్' సినిమాను మెచ్చిన చిరు!
- May 04, 2016
పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల తరువాత మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన మూవీ సుప్రీమ్. ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న రాత్రి స్పెషల్ షో చూశారు. ఈ విశేషాలపై సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. తన లేటెస్ట్ మూవీ 'సుప్రీమ్'ను మావయ్య చిరంజీవి నిన్న రాత్రి చూసి ఎంజాయ్ చేశారని పేర్కొంటూ తన ఆనందాన్ని అభిమానులతో సాయి ధరమ్ పంచుకున్నాడు. ఈరోజు విడుదలవుతున్న తన మూవీ సక్సెస్ అవ్వాలని చిరంజీవి తనను, మూవీ యూనిట్ ను ఆశీర్వదించారని చెప్పాడు. అందుకు మామ చిరుకు ధన్యవాదాలు తెలుపుతూ యంగ్ హీరో ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.సాయిధరమ్తేజ్, రాశీ ఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన 'సుప్రీమ్' నేడు విడుదల కానున్న విషయం తెలిసిందే. చిరంజీవి హిట్ మూవీ 'యముడికి మొగుడు'లోని పాపులర్ సాంగ్ 'అందం హిందోళం... అధరం తాంబూలం...' ఇందులో రీమిక్స్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటుందని సాయి ధరమ్ తో పాటు యూనిట్ భావిస్తోంది. ఈ మూవీ అందర్నీ అలరించే ఓ మాస్ ఎంటర్టైనర్. వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని యూనిట్ చెబుతోంది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని భావించినా, భారీ సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేయక తప్పలేదు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









