ఒత్తిడికి దూరంగా వుండాలంటే వీటికీ దూరంగా వుండాలి సుమా.!
- March 12, 2023ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరినీ వేధిస్తున్న సమస్య ఒత్తిడి. రకరకాల సమస్యలు, మారిన జీవన శైలి.. తదితర అంశాలను ఒత్తిడిని ప్రభావితం చేస్తున్నాయ్. దీని నుంచి తప్పించుకునేందుకు డైట్లో కొన్ని ఆహార పదార్ధాలను మినహాయిస్తే సరిపోతుంది.
ఒత్తిడితో బాధపడుతున్న వారు ఉప్పు తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉప్పు మానసిక ఉల్లాసాన్ని దెబ్బ తీస్తుంది. తొందరగా అలసిపోయేలా చేస్తుంది. ఉప్పు ఎక్కువగా వుండే ప్రాసెస్డ్ ఫుడ్, నిల్వ పచ్చళ్లు, అప్పడాలు తదితర ఆహార పదార్ధాలకు దూరంగా వుంటే మంచిది.
తీపి పదార్ధాలు శక్తి స్థాయిని ప్రభావితం చేస్తాయి. శరీర అసమతుల్యతకు దారి తీస్తుంది. తద్వారా టెన్షన్ ఎక్కువై డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదం వుంది. సో, చక్కెర పదార్ధాలను ఒత్తిడిలో వున్నప్పుడు అస్సలు తినకూడదని ఓ సర్వే ద్వారా తేలింది.
ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిందే. ఒత్తిడిలో వున్నప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటుంటారు కొందరు. కానీ, అది చాలా చాలా ప్రమాదకరం. మెదడులోని సెరోటోనిన్ చర్యను ఆల్కహాల్ నియంత్రిస్తుంది. తద్వారా మరింత ఆందోళన పెరుగుతుంది.
అలాగే కెఫిన్ కలిగిన పానీయాలను కూడా డిప్రెషన్లో వున్నప్పుడు అవైడ్ చేయాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు