ఒత్తిడికి దూరంగా వుండాలంటే వీటికీ దూరంగా వుండాలి సుమా.!
- March 12, 2023ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరినీ వేధిస్తున్న సమస్య ఒత్తిడి. రకరకాల సమస్యలు, మారిన జీవన శైలి.. తదితర అంశాలను ఒత్తిడిని ప్రభావితం చేస్తున్నాయ్. దీని నుంచి తప్పించుకునేందుకు డైట్లో కొన్ని ఆహార పదార్ధాలను మినహాయిస్తే సరిపోతుంది.
ఒత్తిడితో బాధపడుతున్న వారు ఉప్పు తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉప్పు మానసిక ఉల్లాసాన్ని దెబ్బ తీస్తుంది. తొందరగా అలసిపోయేలా చేస్తుంది. ఉప్పు ఎక్కువగా వుండే ప్రాసెస్డ్ ఫుడ్, నిల్వ పచ్చళ్లు, అప్పడాలు తదితర ఆహార పదార్ధాలకు దూరంగా వుంటే మంచిది.
తీపి పదార్ధాలు శక్తి స్థాయిని ప్రభావితం చేస్తాయి. శరీర అసమతుల్యతకు దారి తీస్తుంది. తద్వారా టెన్షన్ ఎక్కువై డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదం వుంది. సో, చక్కెర పదార్ధాలను ఒత్తిడిలో వున్నప్పుడు అస్సలు తినకూడదని ఓ సర్వే ద్వారా తేలింది.
ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిందే. ఒత్తిడిలో వున్నప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటుంటారు కొందరు. కానీ, అది చాలా చాలా ప్రమాదకరం. మెదడులోని సెరోటోనిన్ చర్యను ఆల్కహాల్ నియంత్రిస్తుంది. తద్వారా మరింత ఆందోళన పెరుగుతుంది.
అలాగే కెఫిన్ కలిగిన పానీయాలను కూడా డిప్రెషన్లో వున్నప్పుడు అవైడ్ చేయాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?