ఏపీలో ఘోర ప్రమాదం..
- March 18, 2023
అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వీటీపీఎస్లో లిఫ్ట్ వైర్ తెగడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడిపోయింది. దీంతో లిఫ్ట్లో ఉన్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ( వీటీపీసీ) కేంద్రంలో.. లిఫ్ట్ లో ఎనిమిది మంది పైకి వెళుతున్నారు. పైకి వెళుతున్న లిఫ్ట్ వైర్ ఒక్కసారిగా తెగిపోవటంతో.. స్పీడ్ గా లిఫ్ట్ కిందకు పడింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. విధులకు హాజరైన ఉద్యోగులు, సిబ్బంది పై అంతస్తులకు లిఫ్ట్ లో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం వీటిపీఎస్ లోకి ఇతరులు ఎవర్నీ అనుమతించటం లేదు. మీడియాను లోపలికి రానివ్వటం లేదు. కేవలం ప్రమాదం వార్తను మాత్రం బయటకు చెబుతోంది యాజమాన్యం. గాయపడిన కార్మికులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









