ఏపీలో ఘోర ప్రమాదం..
- March 18, 2023
అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వీటీపీఎస్లో లిఫ్ట్ వైర్ తెగడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడిపోయింది. దీంతో లిఫ్ట్లో ఉన్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ( వీటీపీసీ) కేంద్రంలో.. లిఫ్ట్ లో ఎనిమిది మంది పైకి వెళుతున్నారు. పైకి వెళుతున్న లిఫ్ట్ వైర్ ఒక్కసారిగా తెగిపోవటంతో.. స్పీడ్ గా లిఫ్ట్ కిందకు పడింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. విధులకు హాజరైన ఉద్యోగులు, సిబ్బంది పై అంతస్తులకు లిఫ్ట్ లో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం వీటిపీఎస్ లోకి ఇతరులు ఎవర్నీ అనుమతించటం లేదు. మీడియాను లోపలికి రానివ్వటం లేదు. కేవలం ప్రమాదం వార్తను మాత్రం బయటకు చెబుతోంది యాజమాన్యం. గాయపడిన కార్మికులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









