ఏపీలో ఘోర ప్రమాదం..
- March 18, 2023
అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వీటీపీఎస్లో లిఫ్ట్ వైర్ తెగడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడిపోయింది. దీంతో లిఫ్ట్లో ఉన్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ( వీటీపీసీ) కేంద్రంలో.. లిఫ్ట్ లో ఎనిమిది మంది పైకి వెళుతున్నారు. పైకి వెళుతున్న లిఫ్ట్ వైర్ ఒక్కసారిగా తెగిపోవటంతో.. స్పీడ్ గా లిఫ్ట్ కిందకు పడింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. విధులకు హాజరైన ఉద్యోగులు, సిబ్బంది పై అంతస్తులకు లిఫ్ట్ లో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం వీటిపీఎస్ లోకి ఇతరులు ఎవర్నీ అనుమతించటం లేదు. మీడియాను లోపలికి రానివ్వటం లేదు. కేవలం ప్రమాదం వార్తను మాత్రం బయటకు చెబుతోంది యాజమాన్యం. గాయపడిన కార్మికులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు
తాజా వార్తలు
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!









