రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కార్లు.. ఆసియా వ్యక్తి మృతి
- March 21, 2023
యూఏఈ: 34 ఏళ్ల ఆసియా వ్యక్తి పాదచారుల క్రాసింగ్ కోసం అనుమతి లేని స్థలం నుండి రోడ్డు దాటుతుండగా రెండు వేర్వేరు వాహనాలు ఢీకొని మరణించాడు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధితుడు తన సైకిల్తో రోడ్డు దాటుతుండగా అరబ్ వ్యక్తి నడుపుతున్న కారు అతన్ని ఢీకొట్టింది. అదే సమయంలో మరో గల్ఫ్ పౌరుడు నడుపుతున్న కారు కూడా అతన్ని ఢీకొట్టింది. రెండుకార్లు రెండుసార్లు ఢీకొనడం అతడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. రస్ అల్ ఖైమాలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం.. సదరు కార్ల డ్రైవర్లు ట్రాఫిక్ సంకేతాలను గమనించకపోవడం, వారి వాహనాలను శ్రద్ధ లేకుండా నడపడం వల్ల ప్రమాదానికి కారణమై బాధితుడి మరణానికి కారణమయ్యారని వాదించింది. రస్ అల్ ఖైమాలోని ట్రాఫిక్ మిస్డిమినర్ కోర్టు ఇద్దరికి 1,500 దిర్హామ్ల చొప్పున జరిమానా విధించింది. బాధితుడి వారసులకు 66,666 దిర్హాలు చట్టబద్ధమైన బ్లడ్ మనీగా చెల్లించాలని ఇద్దరినీ ఆదేశించింది. ఘటన జరిగినప్పుడు బాధితుడు రోడ్డును కుడి నుంచి ఎడమకు దాటుతున్నట్లు దర్యాప్తులో తేలింది. అతను కుడి లేన్ దాటి.. మధ్య , ఎడమ లేన్ల మధ్య ప్రవేశించాడని, అదే సమయంలో రెండు వాహనాలు అతన్ని ఢీకొన్నాయని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







