ఫీ చెల్లించకుండానే ప్రవాసులకు ఔషధాల విక్రయం!
- March 25, 2023కువైట్: కువైట్ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రవాసులకు నిర్ణీత KD 5 రుసుము చెల్లించకుండానే ఆసుపత్రులు, క్లినిక్లలో ఔషధాలను విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక కొత్త నివేదికను ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధికి సమర్పించినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. నిర్ణీత రుసుము అమలులోకి వచ్చిన తర్వాత మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో ఔషధాల వినియోగం గణనీయంగా తగ్గింది. అయితే ఔషధ వ్యర్థాలను పర్యవేక్షించే విధానాలకు మెడికల్ స్టోర్స్తో పాటు ప్రభుత్వ ఫార్మసీల వద్ద కఠిన నియంత్రణ అవసరమని సంబంధిత వర్గాలు అభిప్రాయపడినట్లు నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్