రక్తం ఉడికిన సిరియా, 73 మంది మృతి
- May 07, 2016
సిరియాలోని అలెప్పో పట్టణంలో భద్రతా దళాలు, అల్ కాయిదా అనుబంధ ఉగ్ర సంస్థల మధ్య జరిగిన భీకర పోరులో 73 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆల్ నుస్రా ఫ్రంట్, దానికి మద్దతిచ్చే ఇస్లాం జిహాదీలు 24 గంటల ఘర్షణల తరువాత ఖాన్ తుమాన్, పరిసర గ్రామాలను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నాయని తెలిసింది. కనీసం 43 మంది జిహాదీలు, 30 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వాయు దాడులకు మేం కారణం కాదు: సిరియా మిలిటరీ టర్కీ సరిహద్దులో ఆశ్రయం పొందుతున్న 28 మంది పౌరుల మృతికి కారణమైన వాయు దాడుల్లో తమ ప్రమేయం లేదని సిరియా సైన్యం ప్రకటించింది. తిరుగుబాటుదారులు ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









