మదీనాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- March 26, 2023సౌదీ: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మార్చి 26న మదీనాలోని ప్రవక్త మస్జిద్ ను సందర్శించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అల్ మదీనా అల్ మునవ్వరా రీజియన్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, అల్ మదీనా అల్ మునవ్వరా రీజియన్ డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ ఖలీద్ అల్-ఫైసల్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రవక్త మసీదును సందర్శించి.. అల్ రౌదా అల్ షరీఫాలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. తరువాత, అతను ఖుబా మసీదును సందర్శించాడు. అక్కడ తహియత్ అల్ మస్జిద్ ప్రార్థనలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి