చిరునామా లేని 16,848 కంపెనీ ఫైల్స్ సస్పెండ్..
- March 26, 2023కువైట్: చెల్లుబాటు అయ్యే పౌర చిరునామాలు లేని 16,848 కంపెనీల ఫైళ్లను కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM) సస్పెండ్ చేసింది. ఆర్టికల్ 18 కింద ఈ కంపెనీల క్రింద 61,688 మంది కార్మికులు నమోదు చేసుకున్నారని తెలిపింది.కాగా కార్మికులు వారి చట్టపరమైన స్థితిని పునరుద్దరించటానికి ఒక నెల గ్రేస్ పీరియడ్ను ఇచ్చినట్లు అథారిటీ పేర్కొంది. "ప్రైవేట్ రంగంలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించేవారిపై నియంత్రణను కఠినతరం చేయాలని" మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు PAM తెలిసింది. అయితే, నిర్దిష్ట వ్యవధిలోగా చట్టపరమైన స్థితిని సరిదిద్దడంలో కంపెనీలు విఫలమైతే, యజమానులపై సంబంధిత దర్యాప్తునకు రిఫర్ చెయ్యనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ