ఏప్రిల్ 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ
- March 26, 2023న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. ఏప్రిల్ 8న హైదరాబాద్ లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. రెండు నెలల క్రితం నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది.
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై హైదరాబాద్ బీజేపీ నేతలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. పెద్దఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రధానిది అధికారిక పర్యటన అయినప్పటికీ పార్టీ తరపున జనసమీకరణ చేయనున్నారు బీజేపీ నేతలు.
ఇక, తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్ రైలు రానుంది. ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విశాఖపట్నానికి వందేభారత్ రైలు నడుస్తోంది. త్వరలోనే సికింద్రబాద్-తిరుపతి మార్గంలో మరో రైలు రాబోతుంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు ప్రస్తుతం నాలుగు రైల్వే మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
అందులో ప్రస్తుతం నారాయణాద్రి రైలు నడుస్తున్న మార్గంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెడతారని తెలుస్తోంది. నారాయణాద్రి రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వరకు వెళ్తుంది. తిరుపతి వందేభారత్ రైలును మొదటగా నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రూట్ లోనే నడపనున్నట్లు తెలుస్తోంది.
సావల్యపురం ఒంగోలు రూటు పూర్తి అయ్యాక ఈ మార్గం నుంచి వందే భారత్ రైలు నడుపుతారని సమాచారం. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో రైలు ఆగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలు హైదారాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు 12 గంటల సమయం పడుతుంది. అదే వందేభారత్ రైలులో 6:30 గంటల్లోనే తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..