డయాబెటిస్ రోగులకి ఈ ఆకులు ఓ ఔషధం.!
- March 27, 2023
సీతాఫలం ఎంతో బలం అంటారు. అవును నిజమే బలమే కాదు, ఎంతో రుచికరం కూడా ఈ ఫలం. అయితే, ఈ పండులో అధిక మోతాదులో చక్కెర స్థాయిలు వుండడం వల్ల డయాబెటిస్ వున్న వాళ్లు ఈ పండుకు దూరంగా వుండమని సూచిస్తుంటారు.
అయితే, సీతా ఫలం.. పండు సంగతెలా వున్నా వీటి ఆకులు మాత్రం డయాబెటిక్ రోగులకు ఓ వరమే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
ఆయుర్వేదపరంగానే కాదు, వైద్య ప్రామాణికంగానూ ఈ ఆకులకు డయాబెటిస్ తగ్గించే శక్తి వుందని కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.
రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో వుంచడం ద్వారా డయాబెటిస్ని అదుపులో వుంచొచ్చు. సీతాఫలం ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నట్లు తాజా అధ్యయనాల్లో బయటపడింది. ఈ ఆకులను తినడం వల్ల ప్యాంక్రియాసిస్లో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో వుంటాయట.
సో, డయాబెటిక్ రోగులకు ఈ ఆకులు చాలా ఉపయోగకరమైనవిగా చెబుతున్నారు. రోజూ రెండు ఆకులను నమిలి తినడం వల్ల షుగర్ అదుపులో వుంటుందంటున్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









