రమదాన్: మోసపూరిత ఫిషింగ్ ప్రచారాలపై NCSA హెచ్చరిక
- March 27, 2023
దోహా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా నకిలీ పెట్టుబడి , రాయితీలు ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని, వీటి ముసుగులో మోసపూరిత ఫిషింగ్ ప్రమాదాలు పొంచిఉన్నాయని ఖతార్లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) హెచ్చరించింది. కొన్ని నకిలీ ప్రచారాలు అనేక జాతీయ ఖతార్ సంస్థల వలె కనిపిస్తాయని, ఈ ప్రచారాలకు స్పందించవద్దని, వారు సూచించిన లింక్ లను ఓపెన్ చేయొద్దని NCSA హెచ్చరించింది. సాధారణంగా ఫిషింగ్ ప్రచారాల కోసం సైబర్ మోసగాళ్లు ఉచిత, ఓపెన్ సోర్స్ "Wordpress" వ్యవస్థను కూడా ఉపయోగిస్తాయని తెలిపింది. వాటిని అధికారిక సంస్థలు ఉపయోగించవని గుర్తించాలన్నారు. సైబర్ మోసగాళ్లు వ్యక్తిగత బ్యాంకింగ్ డేటాను అడుగుతారని, ఆర్థిక పెట్టుబడి - తగ్గింపు ఆఫర్ల ద్వారా ప్రజలను ఆకర్షించడానికి ప్రకటనలు ఇస్తారని తెలిపారు. ఖతార్లోని అధికారిక అధికారులు దరఖాస్తుదారుల నుండి వ్యక్తిగత డేటాను అభ్యర్థించరని, అన్ని అధికారిక లావాదేవీలు "హుకూమి" ప్లాట్ఫారమ్ లేదా జాతీయ డాక్యుమెంటేషన్ ప్లాట్ఫారమ్ ద్వారా నిర్వహించబడతాయని NCSA గుర్తు చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







