రమదాన్: మోసపూరిత ఫిషింగ్ ప్రచారాలపై NCSA హెచ్చరిక
- March 27, 2023
దోహా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా నకిలీ పెట్టుబడి , రాయితీలు ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని, వీటి ముసుగులో మోసపూరిత ఫిషింగ్ ప్రమాదాలు పొంచిఉన్నాయని ఖతార్లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) హెచ్చరించింది. కొన్ని నకిలీ ప్రచారాలు అనేక జాతీయ ఖతార్ సంస్థల వలె కనిపిస్తాయని, ఈ ప్రచారాలకు స్పందించవద్దని, వారు సూచించిన లింక్ లను ఓపెన్ చేయొద్దని NCSA హెచ్చరించింది. సాధారణంగా ఫిషింగ్ ప్రచారాల కోసం సైబర్ మోసగాళ్లు ఉచిత, ఓపెన్ సోర్స్ "Wordpress" వ్యవస్థను కూడా ఉపయోగిస్తాయని తెలిపింది. వాటిని అధికారిక సంస్థలు ఉపయోగించవని గుర్తించాలన్నారు. సైబర్ మోసగాళ్లు వ్యక్తిగత బ్యాంకింగ్ డేటాను అడుగుతారని, ఆర్థిక పెట్టుబడి - తగ్గింపు ఆఫర్ల ద్వారా ప్రజలను ఆకర్షించడానికి ప్రకటనలు ఇస్తారని తెలిపారు. ఖతార్లోని అధికారిక అధికారులు దరఖాస్తుదారుల నుండి వ్యక్తిగత డేటాను అభ్యర్థించరని, అన్ని అధికారిక లావాదేవీలు "హుకూమి" ప్లాట్ఫారమ్ లేదా జాతీయ డాక్యుమెంటేషన్ ప్లాట్ఫారమ్ ద్వారా నిర్వహించబడతాయని NCSA గుర్తు చేసింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







