రమదాన్: మోసపూరిత ఫిషింగ్ ప్రచారాలపై NCSA హెచ్చరిక
- March 27, 2023
దోహా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా నకిలీ పెట్టుబడి , రాయితీలు ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని, వీటి ముసుగులో మోసపూరిత ఫిషింగ్ ప్రమాదాలు పొంచిఉన్నాయని ఖతార్లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) హెచ్చరించింది. కొన్ని నకిలీ ప్రచారాలు అనేక జాతీయ ఖతార్ సంస్థల వలె కనిపిస్తాయని, ఈ ప్రచారాలకు స్పందించవద్దని, వారు సూచించిన లింక్ లను ఓపెన్ చేయొద్దని NCSA హెచ్చరించింది. సాధారణంగా ఫిషింగ్ ప్రచారాల కోసం సైబర్ మోసగాళ్లు ఉచిత, ఓపెన్ సోర్స్ "Wordpress" వ్యవస్థను కూడా ఉపయోగిస్తాయని తెలిపింది. వాటిని అధికారిక సంస్థలు ఉపయోగించవని గుర్తించాలన్నారు. సైబర్ మోసగాళ్లు వ్యక్తిగత బ్యాంకింగ్ డేటాను అడుగుతారని, ఆర్థిక పెట్టుబడి - తగ్గింపు ఆఫర్ల ద్వారా ప్రజలను ఆకర్షించడానికి ప్రకటనలు ఇస్తారని తెలిపారు. ఖతార్లోని అధికారిక అధికారులు దరఖాస్తుదారుల నుండి వ్యక్తిగత డేటాను అభ్యర్థించరని, అన్ని అధికారిక లావాదేవీలు "హుకూమి" ప్లాట్ఫారమ్ లేదా జాతీయ డాక్యుమెంటేషన్ ప్లాట్ఫారమ్ ద్వారా నిర్వహించబడతాయని NCSA గుర్తు చేసింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







