వేసవి ఏర్పాట్ల పై టిటిడి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష

- March 27, 2023 , by Maagulf
వేసవి ఏర్పాట్ల పై టిటిడి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష

తిరుమల: వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సోమవారం తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు శ్రీవారి మెట్టు నడకదారిలో రోజుకు 5వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. వేసవిలో బ్రేక్‌ సిఫారసు లేఖలను తగ్గిస్తామన్నారు. ముఖ గుర్తింపుతో పారదర్శకంగా వసతి సౌకర్యం కేటాయింపులు చేయనున్నట్టు తెలిపారు. వేసవిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందుల లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com