ఆ పత్రాలను ధ్వంసం చేస్తే.. Dh1 మిలియన్ జరిమానా, జైలు శిక్ష
- March 28, 2023యూఏఈ: పబ్లిక్, చారిత్రాత్మక, జాతీయ, ప్రైవేట్ పత్రాలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిన సందర్భాల్లో విధించే జరిమానా, జైలుశిక్ష గురించిన వివరాలను యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం తన సోషల్ మీడియా ఖాతాలలో ఒక పోస్ట్ పెట్టింది. నేషనల్ లైబ్రరీ, ఆర్కైవ్స్ సవరణలపై 2008 ఫెడరల్ లా నెం. (7)లోని ఆర్టికల్ నెం.25 ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఒక పత్రాన్ని నాశనం చేస్తే.. వారికి నిర్బంధ శిక్ష విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఎనిమిది నెలల జరిమానాతోపాటు Dh40,000 - Dh100,000 మధ్య జరిమానా లేదా ఈ రెండింటిని విధించే అవకాశం ఉందని వివరించింది. కీలక పత్రాలను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విధ్వంసం చేసినా, స్మగ్లింగ్ చేసినా, కాపీలు చేసినా లేదా బహిర్గతం చేసినా కనీసం ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష లేదా Dh50,000 - Dh 1,000,000 వరకు జరిమానా విధించబడుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ