పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- March 28, 2023న్యూ ఢిల్లీ: పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఈ విషయంలో మరికొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల ఎందరో వినియోగదారులకు మేలు జరగనుంది. మంగళవారం నాటి ఆదేశాల ప్రకారం.. జూన్ 30 లోపు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే. లేదంటే జూలై 1 నుంచి పాన్ నిరుపయోగంగా మారుతుంది. ఆ తర్వాత పన్నులు చెల్లించాల్సి వస్తే అదనపు జరిమానాల్ని కూడా కేంద్రం వసూలు చేస్తుంది. దీనివల్ల వినియోగదారులపై మరింత భారం పడుతుంది.
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. పాన్ కార్డు ఉన్న ప్రతి వినియోగదారుడు, ఆ కార్డ్ నెంబర్ ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి. దీనిపై కేంద్రం విధించిన గడువు గతంలోనే ముగిసింది. ఆ తర్వాత ఈ గడువును కేంద్రం పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి, మార్చి 31 వరకు ఆధార్-పాన్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. అయితే, మూడు రోజుల్లో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 51 కోట్ల పాన్ కార్డులు ఆధార్తో అనుసంధానమయ్యాయి. పాన్-ఆధార్ లింక్ అయి ఉంటేనే బ్యాంకు ఖాతా తెరవడం, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం వంటివి చేయొచ్చు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు