ఇక ఆన్లైన్లో స్కెంజెన్ వీసాల దరఖాస్తు..!
- March 30, 2023యూఏఈ: స్కెంజెన్ దేశాలకు వెళ్లాలనుకునే యూఏఈ నివాసితులు అపాయింట్మెంట్ల కోసం ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. క్యూలో నిలబడి వీసాలను ప్రాసెస్ కోసం పాస్పోర్ట్లను సమర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే EU పర్మిట్ విధానాన్ని డిజిటలైజ్ చేయడానికి ఒక అడుగు దూరంలో ఉంది. EU సభ్య దేశాలు బుధవారం వీసా విధానాన్ని డిజిటలైజ్ చేసే ప్రతిపాదనపై చర్చించారు. ఈ కొత్త విధానం ఆన్లైన్లో వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. స్వీడిష్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనెర్గార్డ్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కెంజెన్ వీసా చట్టబద్ధమైన ప్రయాణికులు దరఖాస్తు చేసుకోవడానికి సులభతరం చేస్తుందన్నారు. ఆన్లైన్ దరఖాస్తు విధానం వీసా మోసాలను తగ్గిస్తుందని తెలిపారు. ఆన్ లైన్ లో వీసా దరఖాస్తు కోసం ప్రత్యేక ప్లాట్ఫారమ్ను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం.. వీసాలను డిజిటల్ ఫార్మాట్లో 2D బార్కోడ్గా, క్రిప్టోగ్రాఫికల్ సంతకంతో జారీ చేయనున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు