319 మంది ఖైదీలు విడుదల

- March 31, 2023 , by Maagulf
319 మంది ఖైదీలు విడుదల

మస్కట్: రమదాన్ మొదటి వారంలో ఒమన్ సుల్తానేట్‌లో ‘ఫక్ కుర్బా’ చొరవలో భాగంగా 319 మంది ఖైదీలను విడుదల చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ నుండి 98 మంది ఖైదీలు, అల్ దహిరా గవర్నరేట్ నుండి 54 మంది, అల్ బురైమి గవర్నరేట్ నుండి 42 మంది ఖైదీలు విడుదలైన వారిలో ఉన్నారు. అలాగే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ నుండి 32, మస్కట్ గవర్నరేట్ నుండి 29, అల్ దఖిలియా గవర్నరేట్ నుండి 20 మంది దివాలా తీసిన కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు విడుదలయ్యారు.  దక్షిణ అల్ బతినా గవర్నరేట్ 26, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ నుండి 13, ధోఫర్ గవర్నరేట్ నుండి 4, ముసందమ్ గవర్నరేట్ నుండి ఒకరు విడుదలయ్యారు. మొత్తంగా ఫక్ కుర్బా పదవ ఎడిషన్‌లో 1,300 మంది ఖైదీలను విడుదల చేయాలని ఒమన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com