319 మంది ఖైదీలు విడుదల
- March 31, 2023
మస్కట్: రమదాన్ మొదటి వారంలో ఒమన్ సుల్తానేట్లో ‘ఫక్ కుర్బా’ చొరవలో భాగంగా 319 మంది ఖైదీలను విడుదల చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ నుండి 98 మంది ఖైదీలు, అల్ దహిరా గవర్నరేట్ నుండి 54 మంది, అల్ బురైమి గవర్నరేట్ నుండి 42 మంది ఖైదీలు విడుదలైన వారిలో ఉన్నారు. అలాగే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ నుండి 32, మస్కట్ గవర్నరేట్ నుండి 29, అల్ దఖిలియా గవర్నరేట్ నుండి 20 మంది దివాలా తీసిన కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు విడుదలయ్యారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్ 26, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ నుండి 13, ధోఫర్ గవర్నరేట్ నుండి 4, ముసందమ్ గవర్నరేట్ నుండి ఒకరు విడుదలయ్యారు. మొత్తంగా ఫక్ కుర్బా పదవ ఎడిషన్లో 1,300 మంది ఖైదీలను విడుదల చేయాలని ఒమన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!
- సోహార్ టైర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆఫ్రికాకు చెందిన మహిళలు అరెస్ట్..!!
- ఖతార్ మధ్యవర్తిత్వానికి మద్దతు ఇస్తుంది.. అన్నింటికి ఖతార్ సిద్ధం..!!
- యూఏఈ పర్యటనలో మరణించిన భారతీయురాలు..30 రోజుల తర్వాత స్వదేశానికి డెడ్ బాడీ తరలింపు..!!









