319 మంది ఖైదీలు విడుదల
- March 31, 2023
మస్కట్: రమదాన్ మొదటి వారంలో ఒమన్ సుల్తానేట్లో ‘ఫక్ కుర్బా’ చొరవలో భాగంగా 319 మంది ఖైదీలను విడుదల చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ నుండి 98 మంది ఖైదీలు, అల్ దహిరా గవర్నరేట్ నుండి 54 మంది, అల్ బురైమి గవర్నరేట్ నుండి 42 మంది ఖైదీలు విడుదలైన వారిలో ఉన్నారు. అలాగే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ నుండి 32, మస్కట్ గవర్నరేట్ నుండి 29, అల్ దఖిలియా గవర్నరేట్ నుండి 20 మంది దివాలా తీసిన కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు విడుదలయ్యారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్ 26, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ నుండి 13, ధోఫర్ గవర్నరేట్ నుండి 4, ముసందమ్ గవర్నరేట్ నుండి ఒకరు విడుదలయ్యారు. మొత్తంగా ఫక్ కుర్బా పదవ ఎడిషన్లో 1,300 మంది ఖైదీలను విడుదల చేయాలని ఒమన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!







