స్వచంద పదవీ విరమణ పొందిన ఖదీర్ ను సన్మానించిన సీపీ చౌహాన్
- March 31, 2023
హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషరేట్ లోని కీసర పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎండీ. ఖదీర్ ఈ రోజు స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. LB Nagar లోని సిపి క్యాంప్ ఆఫీస్ లో రాచకొండ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ ఖదీర్ ను సన్మానించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... ఉద్యోగ నిర్వహణలో సుధీర్ఘ కాలంగా అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న ఖదీర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు.రిటైర్ మెంట్ డబ్బును భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బులను ఆచితూచి ఖర్చు చేయాలన్నారు.ఈ సందర్భంగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బెనిఫిట్ ఫండ్ క్రింద 30,000/- రూ మరియు సొసైటీ పొదుపు మొత్తాన్ని 1,12,964/- రూ చేకులను సీపీ ఖదీర్ కు అందచేశారు.
ఈ కార్యక్రమంలో సీపీతో పాటు డీసీపీ అడ్మిన్ పి.ఇందిర, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్ భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, రవుఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!







