స్వచంద పదవీ విరమణ పొందిన ఖదీర్ ను సన్మానించిన సీపీ చౌహాన్
- March 31, 2023
హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషరేట్ లోని కీసర పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎండీ. ఖదీర్ ఈ రోజు స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. LB Nagar లోని సిపి క్యాంప్ ఆఫీస్ లో రాచకొండ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ ఖదీర్ ను సన్మానించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... ఉద్యోగ నిర్వహణలో సుధీర్ఘ కాలంగా అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న ఖదీర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు.రిటైర్ మెంట్ డబ్బును భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బులను ఆచితూచి ఖర్చు చేయాలన్నారు.ఈ సందర్భంగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బెనిఫిట్ ఫండ్ క్రింద 30,000/- రూ మరియు సొసైటీ పొదుపు మొత్తాన్ని 1,12,964/- రూ చేకులను సీపీ ఖదీర్ కు అందచేశారు.
ఈ కార్యక్రమంలో సీపీతో పాటు డీసీపీ అడ్మిన్ పి.ఇందిర, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్ భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, రవుఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!
- సోహార్ టైర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆఫ్రికాకు చెందిన మహిళలు అరెస్ట్..!!
- ఖతార్ మధ్యవర్తిత్వానికి మద్దతు ఇస్తుంది.. అన్నింటికి ఖతార్ సిద్ధం..!!
- యూఏఈ పర్యటనలో మరణించిన భారతీయురాలు..30 రోజుల తర్వాత స్వదేశానికి డెడ్ బాడీ తరలింపు..!!
- యుద్ధం పై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్పై దాడులకు బ్రేక్!
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత









