బాధితుల రక్షణకు ప్రత్యేక కార్యాలయం: LMRA
- March 31, 2023
బహ్రెయిన్: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) బాధితులు, వ్యక్తుల అక్రమ రవాణా కేసుల్లో సాక్షుల రక్షణ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్లు LMRA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వ్యక్తుల అక్రమ రవాణా నిరోధ జాతీయ కమిటీ అధిపతి నౌఫ్ అబ్దుల్రహ్మాన్ జంషీర్ తెలిపారు. వ్యక్తుల అక్రమ రవాణా కేసులను అధ్యయనం చేసి అభ్యర్థనలను సమర్పించడం ద్వారా ఈ ప్రత్యేక కార్యాలయం పబ్లిక్ ప్రాసిక్యూషన్తో సంప్రదింపుల పాయింట్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. కోర్టు తీర్పుల అమలును అనుసరించడంతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రక్రియల సమయంలో మానసిక, భౌతిక నష్టం నుండి బాధితులు, సాక్షులను రక్షించడం దీని లక్ష్యమన్నారు. బాధితులు, సాక్షుల రక్షణ కోసం LMRA కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, వ్యక్తుల అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై 2008 నాటి చట్టం నెం.1 నిబంధనల అమలుకు అనుగుణంగా.. ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్కు వ్యతిరేకంగా UN కన్వెన్షన్కు అనుగుణంగా చర్యలు ప్రారంభించినట్లు జంషీర్ చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







