కిలిమంజారో పర్వత శిఖరాన్ని చేరుకున్న 13 ఏళ్ల ఎమిరాటీ బాలిక
- April 02, 2023
యూఏఈ: పదమూడు ఏళ్ల ఎమిరాటీ బాలిక అయా ఫకీహ్ కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోయించింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఈ రికార్డు గతంలో అయా కజిన్స్ పేరిట ఉంది. వారు ఈ ఘనతను 2018లో సాధించారు. మోవియా అల్షున్నార్ 15.5 సంవత్సరాల వయస్సులో పర్వతాన్ని అధిరోహించగా, అతని సోదరుడు అలీ 15 సంవత్సరాల ఒక నెలలో పర్వతాన్ని అధిరోహించారు. వారి చిన్న తోబుట్టువు సీఫ్ 14 ఏళ్ళ వయసులో శిఖరాన్ని జయించాడు. ‘‘భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించే రూమ్ టు రీడ్ వంటి స్వచ్ఛంద సంస్థలకు నేను మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను." అని అయా ఫకీహ్ అన్నారు. 5,895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన ఫ్రీ-స్టాండింగ్ పర్వతం. ఇది టాంజానియాలో ఉంది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







