కిలిమంజారో పర్వత శిఖరాన్ని చేరుకున్న 13 ఏళ్ల ఎమిరాటీ బాలిక
- April 02, 2023
యూఏఈ: పదమూడు ఏళ్ల ఎమిరాటీ బాలిక అయా ఫకీహ్ కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోయించింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఈ రికార్డు గతంలో అయా కజిన్స్ పేరిట ఉంది. వారు ఈ ఘనతను 2018లో సాధించారు. మోవియా అల్షున్నార్ 15.5 సంవత్సరాల వయస్సులో పర్వతాన్ని అధిరోహించగా, అతని సోదరుడు అలీ 15 సంవత్సరాల ఒక నెలలో పర్వతాన్ని అధిరోహించారు. వారి చిన్న తోబుట్టువు సీఫ్ 14 ఏళ్ళ వయసులో శిఖరాన్ని జయించాడు. ‘‘భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించే రూమ్ టు రీడ్ వంటి స్వచ్ఛంద సంస్థలకు నేను మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను." అని అయా ఫకీహ్ అన్నారు. 5,895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన ఫ్రీ-స్టాండింగ్ పర్వతం. ఇది టాంజానియాలో ఉంది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!