దుబాయ్ లో 67 మంది యాచకులు అరెస్ట్
- April 04, 2023
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం నుండి 67 మంది యాచకులను (31 మంది పురుషులు, 36 మంది మహిళలు) అరెస్టు చేసినట్టు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. పోలీసుల భిక్షాటన వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయని పేర్కొన్నారు. బిచ్చగాళ్లు సమాజం, ఆస్తుల భద్రతకు ముప్పు కలిగిస్తారని, దేశ ప్రతిష్టను ప్రభావితం చేస్తారని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లోని ఇన్ఫిల్ట్రేషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అలీ సలేమ్ అల్ షమ్సీ అన్నారు. భిక్షాటన అనేది దొంగతనాలు, దోపిడీలు వంటి నేరాలతో ముడిపడి ఉందని, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు, దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులను దోపిడీ చేయడం వంటి తీవ్రమైన నేరాలతో ముడిపడి ఉందని ఆయన తెలిపారు. బిచ్చగాళ్లపై తక్షణమే కాల్ సెంటర్ 901 లేదా పోలీస్ యాప్లోని ‘పోలీస్ ఐ’ సేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పవిత్ర రమదాన్ మాసానికి ముందు ఎమిరేట్లోని పోలీసు బలగాలు నేరానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాయి. రమదాన్ సమయంలో ప్రజల దాతృత్వాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యాచకులు పెద్ద సంఖ్యలో దేశానికి వస్తారు. భిక్షాటనను 'ఆర్థిక మోసం'గా వర్గీకరిస్తున్నట్లు షార్జా పోలీసులు ఇటీవల వెల్లడించారు. విజిట్ వీసాపై దేశంలోకి పెద్ద సంఖ్యలో యాచకులు ప్రవేశించారని పోలీసు ఆపరేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ బ్రిగ్ జనరల్ ఇబ్రహీం అల్ అజెల్ తెలిపారు. తమను టూరిస్ట్ కంపెనీలే తీసుకొచ్చాయని అదుపులోకి తీసుకున్న యాచకులు చెబుతున్నారు. డబ్బు కోసం అడుక్కోవడానికి ఈ కంపెనీలు వారికి నెలవారీ జీతాలు చెల్లిస్తుండటం గమనార్హం. భిక్షాటన చేస్తూ అనేక మంది వ్యక్తులు, బృందాలు పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. గత నెల, దుబాయ్ పోలీసులు ఒక బిచ్చగాడిని అరెస్టు చేసి, అతని కృత్రిమ అవయవంలో దాచిన 300,000 దిర్హామ్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







