దుబాయ్ లో 67 మంది యాచకులు అరెస్ట్
- April 04, 2023
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం నుండి 67 మంది యాచకులను (31 మంది పురుషులు, 36 మంది మహిళలు) అరెస్టు చేసినట్టు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. పోలీసుల భిక్షాటన వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయని పేర్కొన్నారు. బిచ్చగాళ్లు సమాజం, ఆస్తుల భద్రతకు ముప్పు కలిగిస్తారని, దేశ ప్రతిష్టను ప్రభావితం చేస్తారని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లోని ఇన్ఫిల్ట్రేషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అలీ సలేమ్ అల్ షమ్సీ అన్నారు. భిక్షాటన అనేది దొంగతనాలు, దోపిడీలు వంటి నేరాలతో ముడిపడి ఉందని, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు, దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులను దోపిడీ చేయడం వంటి తీవ్రమైన నేరాలతో ముడిపడి ఉందని ఆయన తెలిపారు. బిచ్చగాళ్లపై తక్షణమే కాల్ సెంటర్ 901 లేదా పోలీస్ యాప్లోని ‘పోలీస్ ఐ’ సేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పవిత్ర రమదాన్ మాసానికి ముందు ఎమిరేట్లోని పోలీసు బలగాలు నేరానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాయి. రమదాన్ సమయంలో ప్రజల దాతృత్వాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యాచకులు పెద్ద సంఖ్యలో దేశానికి వస్తారు. భిక్షాటనను 'ఆర్థిక మోసం'గా వర్గీకరిస్తున్నట్లు షార్జా పోలీసులు ఇటీవల వెల్లడించారు. విజిట్ వీసాపై దేశంలోకి పెద్ద సంఖ్యలో యాచకులు ప్రవేశించారని పోలీసు ఆపరేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ బ్రిగ్ జనరల్ ఇబ్రహీం అల్ అజెల్ తెలిపారు. తమను టూరిస్ట్ కంపెనీలే తీసుకొచ్చాయని అదుపులోకి తీసుకున్న యాచకులు చెబుతున్నారు. డబ్బు కోసం అడుక్కోవడానికి ఈ కంపెనీలు వారికి నెలవారీ జీతాలు చెల్లిస్తుండటం గమనార్హం. భిక్షాటన చేస్తూ అనేక మంది వ్యక్తులు, బృందాలు పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. గత నెల, దుబాయ్ పోలీసులు ఒక బిచ్చగాడిని అరెస్టు చేసి, అతని కృత్రిమ అవయవంలో దాచిన 300,000 దిర్హామ్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







