గల్ఫ్ నుండి 9 కిలోల బంగారం స్మగ్లింగ్.. ముంబై విమానాశ్రయంలో అరెస్ట్
- April 04, 2023
ముంబై: ఇండియాలో భారీ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని కస్టమ్ అధికారులు భగ్నం చేశారు. గల్ఫ్ దేశం నుంచి వస్తున్న వ్యక్తిని ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు అరెస్ట్ చేసి రూ.4.62 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబై కస్టమ్స్ ప్రకారం.. శనివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 9,000 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల బంగారు కడ్డీలను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.4.62 కోట్లు ఉంటుందని కస్టమ్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. రూ.1.40 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు విదేశీ పౌరులను ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ విదేశీ పౌరులు అడిస్ అబాబా నుండి ముంబైకి వచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..







