గల్ఫ్ నుండి 9 కిలోల బంగారం స్మగ్లింగ్.. ముంబై విమానాశ్రయంలో అరెస్ట్
- April 04, 2023
ముంబై: ఇండియాలో భారీ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని కస్టమ్ అధికారులు భగ్నం చేశారు. గల్ఫ్ దేశం నుంచి వస్తున్న వ్యక్తిని ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు అరెస్ట్ చేసి రూ.4.62 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబై కస్టమ్స్ ప్రకారం.. శనివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 9,000 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల బంగారు కడ్డీలను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.4.62 కోట్లు ఉంటుందని కస్టమ్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. రూ.1.40 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు విదేశీ పౌరులను ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ విదేశీ పౌరులు అడిస్ అబాబా నుండి ముంబైకి వచ్చారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









