బంగ్లాదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 3,000 దుకాణాలు
- April 04, 2023
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న బట్టల బజారులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందులో ఉన్న సుమారు 3,000 దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. భారీ మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది, ఆర్మీ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలోనే క్లాత్ మార్కెట్లకు నిలయం బంగాబజార్. ఇరుకైన దుకాణాలు, పెద్ద ఎత్తున జనాలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇందులోనే తెల్లవారుజామున రగులుకున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని బంగ్లా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
ఈ విషయమై అగ్నిమాపక సేవ అధికారి రషీద్ బిన్ ఖలీద్ మాట్లాడుతూ 50 అగ్నిమాపక యూనిట్లు మంటలను ఆర్పడానికి పని చేస్తున్నాయని, అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంక తెలియలేదని అన్నారు. ‘‘చాలా దుకాణాలు మంటల్లో బూడిదయ్యాయి. అయితే లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. చాలా దుకాణాలు తెరవకముందే తెల్లవారుజామున మంటలు చెలరేగాయి’’ అని ఖలీద్ చెప్పారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







