"గౌతమిపుత్ర శాతకర్ణి"- అభిమానగీతం
- May 08, 2016
నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న "గౌతమీపుత్ర శాతకర్ణి" కి గౌరవసూచకంగా గీతరచయిత సిరాశ్రీ, సంగీత దర్శకులు రవిశంకర్ సంయుక్తంగా రూపొందించిన ఒక గీతాన్ని నేడు విడుదల చేసారు. "ఈ చిత్రం ప్రకటన వినగానే గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథసత్యనారాయణగారు వ్రాసిన "ఆంధ్రప్రశస్తి" చదివాను. వెంటనే పాట వ్రాయాలని స్ఫూర్తి కలిగింది. వ్రాసిన వెంటనే అదే స్ఫూర్తితో "కిల్లింగ్ వీరప్పన్", "ఎటాక్" చిత్రాలకు సంగీతాన్ని అందించిన రవిశంకర్ అద్భుతంగా స్వరపరిచారు. గాయకుడు రోహిత్ ఎంతో అర్థవంతంగా పాడారు. ఈ పాటను కేవలం ఫ్యాన్ మేడ్ గా విడుదల చేసిందే తప్ప, దీనికి నందమూరి బాలకృష్ణ- దర్శకులు క్రిష్ గార్ల చిత్రానికి ఎటువంటి సంబంధమూ లేదు. రోమాంఛితమైన ఇంతటి గొప్ప చిత్రాన్ని తీస్తున్న దర్శకులు క్రిష్ గారికి, నటిస్తున్న బాలకృష్ణ గారికి తెలుగుజాతి ఎప్పటికీ ఋణపడి ఉంటుంది", అని గీతరచయిత సిరాశ్రీ తెలిపారు. "ఈ పాట తొలినాటి తెలుగు చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణిని పరిచయం చేస్తుంది. చరిత్ర చెప్పినట్టు ఆయన గొప్ప యోధుడు కనుక ఈ పాటను ఆ పదంతోనే మొదలుపెట్టాము", అని సంగీతదర్శకులు రవిశంకర్ తెలిపారు.
https://drive.google.com/file/d/0B1tNK2LaBZtVYmZWaU1pejEyeDQ/view
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









