"గౌతమిపుత్ర శాతకర్ణి"- అభిమానగీతం
- May 08, 2016
నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న "గౌతమీపుత్ర శాతకర్ణి" కి గౌరవసూచకంగా గీతరచయిత సిరాశ్రీ, సంగీత దర్శకులు రవిశంకర్ సంయుక్తంగా రూపొందించిన ఒక గీతాన్ని నేడు విడుదల చేసారు. "ఈ చిత్రం ప్రకటన వినగానే గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథసత్యనారాయణగారు వ్రాసిన "ఆంధ్రప్రశస్తి" చదివాను. వెంటనే పాట వ్రాయాలని స్ఫూర్తి కలిగింది. వ్రాసిన వెంటనే అదే స్ఫూర్తితో "కిల్లింగ్ వీరప్పన్", "ఎటాక్" చిత్రాలకు సంగీతాన్ని అందించిన రవిశంకర్ అద్భుతంగా స్వరపరిచారు. గాయకుడు రోహిత్ ఎంతో అర్థవంతంగా పాడారు. ఈ పాటను కేవలం ఫ్యాన్ మేడ్ గా విడుదల చేసిందే తప్ప, దీనికి నందమూరి బాలకృష్ణ- దర్శకులు క్రిష్ గార్ల చిత్రానికి ఎటువంటి సంబంధమూ లేదు. రోమాంఛితమైన ఇంతటి గొప్ప చిత్రాన్ని తీస్తున్న దర్శకులు క్రిష్ గారికి, నటిస్తున్న బాలకృష్ణ గారికి తెలుగుజాతి ఎప్పటికీ ఋణపడి ఉంటుంది", అని గీతరచయిత సిరాశ్రీ తెలిపారు. "ఈ పాట తొలినాటి తెలుగు చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణిని పరిచయం చేస్తుంది. చరిత్ర చెప్పినట్టు ఆయన గొప్ప యోధుడు కనుక ఈ పాటను ఆ పదంతోనే మొదలుపెట్టాము", అని సంగీతదర్శకులు రవిశంకర్ తెలిపారు.
https://drive.google.com/file/d/0B1tNK2LaBZtVYmZWaU1pejEyeDQ/view
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







