ఓట్స్ తో ఆవడ
- May 08, 2016
కావలసిన పదార్థాలు: ఓట్స్- 2 టేబుల్ స్పూన్లు, పెసరపప్పు- 1/4 కప్పు, మినప్పప్పు- 1/4 కప్పు, బేకింగ్ పౌడర్- 1/4 టీ స్పూను, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- రుచికి సరిపడా, పెరుగు- 2 కప్పులు, కారం- 1/4 టీ స్పూను, అల్లం తరుగు- 1/4 టీ స్పూను, ఉల్లిపాయలు- 2, పచ్చిమిర్చి- 2, కరివేపాకు- 1 రెబ్బ, తాలింపు దినుసులు- 1 టీ స్పూను.
తయారీ విధానం: పెసరపప్పు, మినపప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పావుకప్పు నీళ్ళు పోసి రుబ్బుకోవాలి. తరువాత ఓట్స్ను దోరగా వేగించి పొడిచేసి రుబ్బిపెట్టుకున్న పిండిలో కలిపి, బేకింగ్ పౌడర్, ఉప్పు కూడా వేసి అరగంట నానబెట్టాలి. పెరుగులో ఉప్పు, కారం, అల్లం, ఉల్లి, పచ్చిమిర్చిల తరుగు కలిపి, పోపు పెట్టి పక్కన ఉంచాలి. ఆ తరువాత గుంట పొంగడాల పెనం గుంటలకు నూనె రాసి, వాటిలో పిండి నింపి రెండు వైపులా వేగించి పెరుగు మిశ్రమంలో వేయాలి.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు









