ఓట్స్ తో ఆవడ
- May 08, 2016
కావలసిన పదార్థాలు: ఓట్స్- 2 టేబుల్ స్పూన్లు, పెసరపప్పు- 1/4 కప్పు, మినప్పప్పు- 1/4 కప్పు, బేకింగ్ పౌడర్- 1/4 టీ స్పూను, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- రుచికి సరిపడా, పెరుగు- 2 కప్పులు, కారం- 1/4 టీ స్పూను, అల్లం తరుగు- 1/4 టీ స్పూను, ఉల్లిపాయలు- 2, పచ్చిమిర్చి- 2, కరివేపాకు- 1 రెబ్బ, తాలింపు దినుసులు- 1 టీ స్పూను.
తయారీ విధానం: పెసరపప్పు, మినపప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పావుకప్పు నీళ్ళు పోసి రుబ్బుకోవాలి. తరువాత ఓట్స్ను దోరగా వేగించి పొడిచేసి రుబ్బిపెట్టుకున్న పిండిలో కలిపి, బేకింగ్ పౌడర్, ఉప్పు కూడా వేసి అరగంట నానబెట్టాలి. పెరుగులో ఉప్పు, కారం, అల్లం, ఉల్లి, పచ్చిమిర్చిల తరుగు కలిపి, పోపు పెట్టి పక్కన ఉంచాలి. ఆ తరువాత గుంట పొంగడాల పెనం గుంటలకు నూనె రాసి, వాటిలో పిండి నింపి రెండు వైపులా వేగించి పెరుగు మిశ్రమంలో వేయాలి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









