ఓట్స్ తో ఆవడ
- May 08, 2016
కావలసిన పదార్థాలు: ఓట్స్- 2 టేబుల్ స్పూన్లు, పెసరపప్పు- 1/4 కప్పు, మినప్పప్పు- 1/4 కప్పు, బేకింగ్ పౌడర్- 1/4 టీ స్పూను, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- రుచికి సరిపడా, పెరుగు- 2 కప్పులు, కారం- 1/4 టీ స్పూను, అల్లం తరుగు- 1/4 టీ స్పూను, ఉల్లిపాయలు- 2, పచ్చిమిర్చి- 2, కరివేపాకు- 1 రెబ్బ, తాలింపు దినుసులు- 1 టీ స్పూను.
తయారీ విధానం: పెసరపప్పు, మినపప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పావుకప్పు నీళ్ళు పోసి రుబ్బుకోవాలి. తరువాత ఓట్స్ను దోరగా వేగించి పొడిచేసి రుబ్బిపెట్టుకున్న పిండిలో కలిపి, బేకింగ్ పౌడర్, ఉప్పు కూడా వేసి అరగంట నానబెట్టాలి. పెరుగులో ఉప్పు, కారం, అల్లం, ఉల్లి, పచ్చిమిర్చిల తరుగు కలిపి, పోపు పెట్టి పక్కన ఉంచాలి. ఆ తరువాత గుంట పొంగడాల పెనం గుంటలకు నూనె రాసి, వాటిలో పిండి నింపి రెండు వైపులా వేగించి పెరుగు మిశ్రమంలో వేయాలి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







