జయంరవి నూతన చిత్రంగా తనీఒరవన్-2
- May 08, 2016
జయంరవి 25వ చిత్రంగా తనీఒరవన్-2 ఉంటుందని ఆయన సహోదరుడు, దర్శకుడు మోహన్రాజా వెల్లడించారు.ఆయనపై రీమేక్ చిత్రాల దర్శకుడన్న ముద్రను తుడిచేసిన చిత్రం తనీఒరువన్. జయంరవి కథానాయకుడిగా నయనతార నాయకిగా గత ఏడాది తెరపైకి వచ్చిన సంచలన చిత్రం తనీఒరువన్ .జయంరవి చిత్రాల్లోనే పెద్ద హిట్గా నిలిచిన ఈ చిత్రం పలు కోలీవుడ్లో ఒక సంచలన చిత్రంగా నమోదైంది.ప్రస్తుతం పలు భాషల్లో రీమేక్కు రెడీ అవుతున్న తనీఒరువన్ తాజాగా తెలుగులో రామ్చరణ్ హీరోగా పునర్నిర్మాణం కానుంది.ఇటీవలే దివంగత ప్రఖ్యాత నిర్మాత నాగిరెడ్డి అవార్డును గెలుచుకున్న ఈ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడుతోంది. సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి విజయవంతమైన చిత్రానికి రెండో భాగం ఉంటుందన్న ప్రశ్న చాలా మందిలో నెలకొంది. దానికి ఆ చిత్ర దర్శకుడు మోహన్రాజా ఇటీవల బదులిస్తూ జయంరవి 25వ చిత్రంగా తనీఒరువన్-2 ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆయన శివకార్తికేయన్ హీరోగా చిత్రం తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక జయంరవి భోగన్ చిత్రం పూర్తి చేసి మిరుదన్కు సీక్వెల్ చేయనున్నారు. దీంతో తనీఒరువన్-2 రూపొందడానికి ఇంకా చాలా సమయం ఉంటుందన్నది తెలుస్తోంది.
తాజా వార్తలు
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!









