కల్తీ మద్యం తాగి 8 మంది మృతి
- April 15, 2023
పాట్నా: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్ లో కల్తీ మద్యం ఏరులైపారుతోంది. కొందరు వ్యాపారులు లాభాలే పరమావధిగా భావిస్తున్నారు. అక్రమంగా కల్తీ మద్యం తయారు చేసి, విక్రయిస్తూ ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు. కల్తీ మద్యానికి బలైన ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.
శనివారం (ఏప్రిల్15)న రాష్ట్రంలోని మోతిహారిలో కల్తీ మద్యం తాగి 8 మంది మృతి చెందారు. మరో 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2016 ఎప్రిల్ లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించింది. అయినా రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా తయారైన కల్తీ మద్యం తాగి అనేక మంది తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







