సౌదీలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టీ20 లీగ్.. !
- April 16, 2023
యూఏఈ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన T20 లీగ్గా గుర్తింపు పొందింది. అయితే, సౌదీ అరేబియా గల్ఫ్ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక T20 లీగ్ను ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. లీగ్ ఏర్పాటుపై సౌదీ అరేబియా ప్రభుత్వం యోచిస్తోందని శుక్రవారం మీడియా కథనాలు తెలిపాయి. సౌదీ అరేబియా ప్రభుత్వ ప్రతినిధులు ఐపీఎల్ను నిర్వహిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులతో కలిసి లీగ్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు నివేదికలు తెలిపాయి. దాదాపు ఏడాది కాలంగా లీగ్కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని మెల్బోర్న్లోని ది ఏజ్లో ఒక నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని ఇతర టీ20 లీగ్లలో పాల్గొనేందుకు అనుమతి లేని భారత ఆటగాళ్లు లీగ్లో పాల్గొనవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. కొత్త లీగ్లో ఆడేందుకు భారత ఆటగాళ్లను అనుమతించాలని సౌదీ ప్రతినిధులు అభ్యర్థించినట్లు సమాచారం. సౌదీ అరేబియా ఫార్ములా వన్, సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్, సౌదీ ఇంటర్నేషనల్ గోల్ఫ్, టాప్ బాక్సింగ్ బౌట్ల వంటి అనేక ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లను నిర్వహించింది. సౌదీ అరేబియాను ప్రపంచ క్రికెట్ గమ్యస్థానంగా మార్చడం తమ లక్ష్యం అని సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ చైర్మన్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ అల్-సౌద్ గత నెలలో మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. సౌదీ టూరిజం అథారిటీ, అరామ్కో ఈ ఏడాది IPL అధికారిక భాగస్వాములుగా వ్యవహారిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







