మక్కా - రియాద్ రోడ్డులో బస్సు బోల్తా.. 44 మందికి గాయాలు
- April 18, 2023
రియాద్ : మక్కా-రియాద్ రోడ్డులో బస్సు బోల్తా పడ్డ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 44 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సివిల్ డిఫెన్స్, సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది. అల్-హుమియాత్, అల్-ఖస్రా మధ్య ప్రయాణీకుల బస్సు బోల్తా పడిందని రియాద్ ప్రాంతంలోని సౌదీ రెడ్ క్రెసెంట్కు సమాచారం అందగానే.. పది అంబులెన్స్ బృందాలు, ఆరోగ్య శాఖకు చెందిన 6 బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయని వెల్లడించింది. గాయపడ్డ 44 మంది ప్రయాణికులలో 36 మందిని అల్-రువైదా, అల్-ఖస్రా, అఫీఫ్ మరియు ధాల్మ్ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు తరలించామని, మిగిలిన 10 మందికి సంఘటన స్థలంలోనే చికిత్స అందించి పంపించామని సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









