మక్కా - రియాద్ రోడ్డులో బస్సు బోల్తా.. 44 మందికి గాయాలు
- April 18, 2023
రియాద్ : మక్కా-రియాద్ రోడ్డులో బస్సు బోల్తా పడ్డ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 44 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సివిల్ డిఫెన్స్, సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది. అల్-హుమియాత్, అల్-ఖస్రా మధ్య ప్రయాణీకుల బస్సు బోల్తా పడిందని రియాద్ ప్రాంతంలోని సౌదీ రెడ్ క్రెసెంట్కు సమాచారం అందగానే.. పది అంబులెన్స్ బృందాలు, ఆరోగ్య శాఖకు చెందిన 6 బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయని వెల్లడించింది. గాయపడ్డ 44 మంది ప్రయాణికులలో 36 మందిని అల్-రువైదా, అల్-ఖస్రా, అఫీఫ్ మరియు ధాల్మ్ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు తరలించామని, మిగిలిన 10 మందికి సంఘటన స్థలంలోనే చికిత్స అందించి పంపించామని సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!







