మక్కా - రియాద్‌ రోడ్డులో బస్సు బోల్తా.. 44 మందికి గాయాలు

- April 18, 2023 , by Maagulf
మక్కా - రియాద్‌ రోడ్డులో బస్సు బోల్తా.. 44 మందికి గాయాలు

రియాద్ :  మక్కా-రియాద్‌ రోడ్డులో బస్సు బోల్తా పడ్డ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 44 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సివిల్ డిఫెన్స్, సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది. అల్-హుమియాత్, అల్-ఖస్రా మధ్య ప్రయాణీకుల బస్సు బోల్తా పడిందని రియాద్ ప్రాంతంలోని సౌదీ రెడ్ క్రెసెంట్‌కు సమాచారం అందగానే.. పది అంబులెన్స్ బృందాలు, ఆరోగ్య శాఖకు చెందిన 6 బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయని వెల్లడించింది. గాయపడ్డ 44 మంది ప్రయాణికులలో 36 మందిని అల్-రువైదా, అల్-ఖస్రా, అఫీఫ్ మరియు ధాల్మ్ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు తరలించామని, మిగిలిన 10 మందికి సంఘటన స్థలంలోనే చికిత్స అందించి పంపించామని సౌదీ రెడ్ క్రెసెంట్‌ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com