స్వల్పంగా పెరిగిన పసిడి ధర
- June 21, 2015
అంతర్జాతీయ ట్రెండ్ మెరుగ్గావుండటం, స్థానికంగా స్టాకిస్టులు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో గతవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచేఅంశమై ఆచితూచి వ్యవహరించనున్నట్లు ప్రకటించడంతో ప్రపంచమార్కెట్లో ఔన్సు బంగారం ధర నెలరోజుల తర్వాత తొలిసారిగా 1,200 డాలర్లస్థాయిని దాటింది. వారంలో 22 డాలర్లు పెరిగిన పుత్తడి 1,202 డాలర్ల వద్దకు చేరింది. దాంతో ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పుత్తడి 10 గ్రాములకు వారంలో ఒకదశలో 27,000 స్థాయిని అధిగమించి, రూ. 27,030 వద్దకు చేరింది. అటుతర్వాత డాలరుతో రూపాయి విలువ బలపడిన కారణంగా 26,935 వద్ద ముగిసింది. గతవారంతో పోలిస్తే రూ. 95 వరకూ లాభపడింది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









