స్వల్పంగా పెరిగిన పసిడి ధర
- June 21, 2015
అంతర్జాతీయ ట్రెండ్ మెరుగ్గావుండటం, స్థానికంగా స్టాకిస్టులు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో గతవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచేఅంశమై ఆచితూచి వ్యవహరించనున్నట్లు ప్రకటించడంతో ప్రపంచమార్కెట్లో ఔన్సు బంగారం ధర నెలరోజుల తర్వాత తొలిసారిగా 1,200 డాలర్లస్థాయిని దాటింది. వారంలో 22 డాలర్లు పెరిగిన పుత్తడి 1,202 డాలర్ల వద్దకు చేరింది. దాంతో ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పుత్తడి 10 గ్రాములకు వారంలో ఒకదశలో 27,000 స్థాయిని అధిగమించి, రూ. 27,030 వద్దకు చేరింది. అటుతర్వాత డాలరుతో రూపాయి విలువ బలపడిన కారణంగా 26,935 వద్ద ముగిసింది. గతవారంతో పోలిస్తే రూ. 95 వరకూ లాభపడింది.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







