మదీనాలో ప్రవక్త జీవిత చరిత్ర, ఇస్లామిక్ నాగరికత పెవిలియన్లు ప్రారంభం
- April 20, 2023
మదీనా: ఇంటర్నేషనల్ ఫెయిర్, మ్యూజియం ఆఫ్ ప్రవక్త జీవిత చరిత్ర, ఇస్లామిక్ సివిలైజేషన్ కొత్త పెవిలియన్లను మదీనా రీజియన్ గవర్నర్, మదీనా డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు చైర్పర్సన్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ మదీనాలో ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మక్కాకు చెందిన ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ డాక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్కరీమ్ అల్-ఇసా, ముస్లిం పండితుల సంస్థ అధ్యక్షుడు- ప్రవక్త అంతర్జాతీయ ప్రదర్శనలు, మ్యూజియంల డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ కూడా పాల్గొన్నారు.
కొత్త పెవిలియన్లలో వివిధ విభాగాలు ఉన్నాయి. 25,000 కంటే ఎక్కువ దైవ ప్రవచనాలు, సినిమా హాల్, ఇంటరాక్షన్ రూమ్, స్మారక బహుమతుల దుకాణం, ప్రవక్తకు సంబంధించిన వస్తువులతో కూడిన విభాగం, వివరణాత్మక పనోరమా ఉన్నాయి. తన మ్యూజియం పర్యటన సందర్భంగా మదినా గవర్నర్ వినూత్న సాంకేతిక పెవిలియన్ను కూడా ప్రారంభించారు. ఇది పవిత్ర ఖురాన్ సేవలో సౌదీ అరేబియా ప్రయత్నాలను అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం - ముస్లింల సేవలో దాని అంతర్జాతీయ ప్రయత్నాలను ప్రదర్శిస్తుంది.
తాజా వార్తలు
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం









