తెల్లగా మెరిసిపోయే దంతాల కోసం.!
- April 20, 2023ప్రస్తుతం పరిస్థితుల్లో దంత సమస్యలు అధికంగా బాధిస్తున్నాయ్. అందుకోసం లిస్టరీన్ తదితర మౌత్ వాష్లు, రకరకాల మౌత్ ప్రెషనర్లు మార్కెట్లో అందుబాటులో వున్నప్పటికీ అవన్నీ జస్ట్ టెంపరరీ రిలీఫ్గానే పని చేస్తున్నాయ్.
దంత సమస్యలు అనేక రకాలు. చిగుళ్ల నుంచి రక్తం కారడం, గట్టి వస్తువులు కొరకలేకపోవడం, ఐస్ క్రీమ్ వంటి చల్లని వస్తువులు తీసుకున్నప్పుడు పళ్లు జివ్వుమనిపించడం గట్రా రకరకాల సమస్యలకు చిన్న చిన్న వంటింటి చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.!
ఒక బౌల్లో కొద్దిగా బేకింగ్ సోడా, అంతే మోతాదులో చార్కోల్ పౌడర్ (మార్కెట్లో లభిస్తుంది), కొద్దిగా కొబ్బరి నూనె కలిపి, ఈ మిశ్రమంతో ఓ ఐదు నిమిషాలు బ్రష్ చేస్తే దంత సమస్యలు దూరం కావడంతో పాటూ, గార పట్టి పసుపు పచ్చ రంగులోకి మారిపోయిన దంతాలు తెల్లగా మెరుస్తాయి. వారంలో రెండు నుంచి మూడు సార్లు ఇలా చేస్తే సరిపోతుంది.
అలాగే, పసుపు, దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం కలిపిన మిశ్రమంతో బ్రష్ చేసినా ఫలితం వుంటుంది.
పుదీనా ఆకులు నీటిలో మరిగించి అందులో రెండు చుక్కల నిమ్మరసం కలిసి పుక్కిలిస్తే, దంతాలకు సంబంధించిన చిగురు వాపులు, రక్తస్రావం కావడం తదితర సమస్యలు దూరం కావడంతో పాటూ, పసుపు పచ్చని గార పట్టిన పళ్లు తెల్లగా మెరుస్తాయ్. నోటి దుర్వాసన వుండదు.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?