భారత్ కరోనా అప్డేట్

- April 21, 2023 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 11,692 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,48,69,684కు చేరాయి. ఇందులో 4,42,72,256 మంది కోలుకున్నారు. 66,170 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,31,258 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది వైరస్‌కు బలయ్యారు.

కాగా, మొత్తం కేసుల్లో 0.15 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 98.67 శాతం మంది కోలుకోగా, 1.18 శాతం మంది మరణించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com