టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు..మరో ఇద్దరు అరెస్ట్
- April 21, 2023
తెలంగాణ: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ చెందిన మైసయ్య, జనార్దన్ లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్లిద్దరు నిందితుల నుంచి పేపర్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అందుకే ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ చేసే కొద్ది కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. నిందితుల ఇచ్చిన సమాచారం, వారి ఫోన్ డేటా ఆధారంగా కేసును చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.
రేణుక భర్త డాక్య దగ్గర ఏఈ ఏగ్జామ్ పేపర్ ను కొడుకు జనార్దన్ కోసం మైసయ్య రెండు లక్షల రూపాయలను ఇచ్చి కొన్నాడు. తండ్రి, కొడుకులను అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్ కు తరలించారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 19 మంది అరెస్ట్ అయ్యారు. .450 మందిని విచారించారు. ఇక ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే సిట్ నుంచి వివరాలు అందించాలని కోర్టును ఆశ్రయించిన ఈడీ..తాజాగా నిందితులను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ లను కస్టడీకి ఇస్తూ అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!







