టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు..మరో ఇద్దరు అరెస్ట్
- April 21, 2023తెలంగాణ: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ చెందిన మైసయ్య, జనార్దన్ లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్లిద్దరు నిందితుల నుంచి పేపర్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అందుకే ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ చేసే కొద్ది కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. నిందితుల ఇచ్చిన సమాచారం, వారి ఫోన్ డేటా ఆధారంగా కేసును చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.
రేణుక భర్త డాక్య దగ్గర ఏఈ ఏగ్జామ్ పేపర్ ను కొడుకు జనార్దన్ కోసం మైసయ్య రెండు లక్షల రూపాయలను ఇచ్చి కొన్నాడు. తండ్రి, కొడుకులను అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్ కు తరలించారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 19 మంది అరెస్ట్ అయ్యారు. .450 మందిని విచారించారు. ఇక ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే సిట్ నుంచి వివరాలు అందించాలని కోర్టును ఆశ్రయించిన ఈడీ..తాజాగా నిందితులను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ లను కస్టడీకి ఇస్తూ అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం