బొప్పాయి తింటున్నారా.? ఈ జాగ్రత్తలు పాఠిస్తే మంచిది.!
- April 22, 2023బొప్పాయి పండు. చూడగానే నోరూరించే పండు. అరోగ్యానికి ముఖ్యంగా డెంగ్యూతో బాధపడేవారు బొప్పాయి అధికంగా తింటే ప్లేట్లెట్స్ వృద్ధి చెందుతాయని వైద్యులు చెబుతారు. బొప్పాయి పండుతో పాటూ, ఆకు రసం కూడా డెంగ్యూ టైమ్లో కీలక పాత్ర పోషిస్తుంది.
అవును నిజమే, బొప్పాయిలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా వుంటాయ్. బొప్పాయి పండును గర్భిణీ స్ర్తీలు తింటే గర్భస్రావం అవతుందని అంటారు. బాలింతలు పచ్చి బొప్పాయి కూరను తింటే బిడ్డకి సరిపడా పాలు పడతాయని అంటున్నారు.
సరే, ఆ సంగతి పక్కన పెడితే, కొన్ని కొన్ని సందర్భాల్లో తప్ప బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే, కొన్నిరకాల ఆహార పదార్ధాలతో బొప్పాయిని కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్న మాట.
పెరుగుతో బొప్పాయిని కలిపి తీసుకోకూడదట. అలా చేస్తే రక్త హీనత సమస్య తలెత్తుతుందట.
అలాగే, ఆరెంజ్, నిమ్మకాయలతో కలిపి బొప్పాయి పండు తీసుకోవడం మంచిది కాదట. అలా చేయడం వల్ల విరుద్ధమైన జీవక్రియ జరిగి అతిసారం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయట.
సో, బొప్పాయితో కాస్త జాగ్రత్త సుమా.!
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ