ఆభరణాల వ్యాపారిని మోసగించిన వ్యక్తికి జైలుశిక్ష
- April 23, 2023
బహ్రెయిన్: బంగారు ఆభరణాల దుకాణంలో సేల్స్మెన్ను మోసగించి డబ్బు చెల్లించకుండా పారిపోయినందుకు బహ్రెయిన్ కోర్టు ఒక వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించింది. నగల దుకాణంలో దొంగతనం చేశారంటూ కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరిపి అతడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఆభరణాల దుకాణాన్ని సందర్శించి.. ఒక బంగారు వస్తువును ఎంపిక చేసి, ఆన్లైన్ దరఖాస్తును ఉపయోగించి చెల్లించడానికి ఆఫర్ చేసినట్లు కేసు ఫైల్స్ చెబుతున్నాయి. అయితే, ఆ వ్యక్తి బిల్ చేసిన మొత్తాన్ని యాప్ ద్వారా చెల్లించే క్రమంలో మాటల్లో పెట్టి లావాదేవీ పూర్తయిన్నట్లు చెప్పాడని, అనంతరం కొనుగోలు చేసిన వస్తువుతో షాపు నుంచి వేగంగా వెళ్లిపోయాడని సేల్స్ మెన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం చెక్ చేయగా.. బిల్ మొత్తాన్ని చెల్లించలేదని గుర్తించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా.. ఇదే పద్ధతిలో ఆ ప్రాంతంలోని ఇతర బంగారు దుకాణదారులను మోసం చేశాడని దర్యాప్తు అధికారులు కోర్టుకు తెలిపారు. ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు, ముఖ్యంగా అధిక విలువ గల కొనుగోళ్లలో జాగ్రత్తగా ఉండవలసిన ప్రాముఖ్యతను ఈ సంఘటన హైలైట్ చేస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం







