ఆభరణాల వ్యాపారిని మోసగించిన వ్యక్తికి జైలుశిక్ష
- April 23, 2023
బహ్రెయిన్: బంగారు ఆభరణాల దుకాణంలో సేల్స్మెన్ను మోసగించి డబ్బు చెల్లించకుండా పారిపోయినందుకు బహ్రెయిన్ కోర్టు ఒక వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించింది. నగల దుకాణంలో దొంగతనం చేశారంటూ కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరిపి అతడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఆభరణాల దుకాణాన్ని సందర్శించి.. ఒక బంగారు వస్తువును ఎంపిక చేసి, ఆన్లైన్ దరఖాస్తును ఉపయోగించి చెల్లించడానికి ఆఫర్ చేసినట్లు కేసు ఫైల్స్ చెబుతున్నాయి. అయితే, ఆ వ్యక్తి బిల్ చేసిన మొత్తాన్ని యాప్ ద్వారా చెల్లించే క్రమంలో మాటల్లో పెట్టి లావాదేవీ పూర్తయిన్నట్లు చెప్పాడని, అనంతరం కొనుగోలు చేసిన వస్తువుతో షాపు నుంచి వేగంగా వెళ్లిపోయాడని సేల్స్ మెన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం చెక్ చేయగా.. బిల్ మొత్తాన్ని చెల్లించలేదని గుర్తించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా.. ఇదే పద్ధతిలో ఆ ప్రాంతంలోని ఇతర బంగారు దుకాణదారులను మోసం చేశాడని దర్యాప్తు అధికారులు కోర్టుకు తెలిపారు. ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు, ముఖ్యంగా అధిక విలువ గల కొనుగోళ్లలో జాగ్రత్తగా ఉండవలసిన ప్రాముఖ్యతను ఈ సంఘటన హైలైట్ చేస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







