మరో నకిలీ వెబ్ సైట్ ను గుర్తించిన TTD
- April 23, 2023
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కి నకిలీ వెబ్ సైట్ల బెడద పట్టుకుంది. తిరుమలలో మరో నకిలీ వెబ్ సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. నకిలీ వెబ్ సైట్ ను గుర్తించిన టీటీడీ ఐటీ విభాగం తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ దీనిపై విచారణ చేస్తోంది. నకిలీ వెబ్ సైట్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ సూచించింది. ఇప్పటికే 40 నకిలీ వెబ్ సైట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తాజాగా కేసులో వెబ్ సైట్ల సంఖ్య 41కి చేరింది. టీటీడీ వెబ్ సైట్ ను పోలిన రీతిలోనే నకిలీ వెబ్ సైట్లను కోకొళ్లలుగా సృష్టించి మోసగాళ్లు భక్తులను సులభంగా మోసం చేస్తున్న వైనాన్ని టీటీడీ గుర్తించింది. ఇటీవలనే 40 నకిలీ వెబ్ సైట్లను గుర్తించి పోలీసులకు పిర్యాదు చేసింది. తాజాగా ఆదివారం మరో నకిలీ వెబ్ సైట్ ను టీటీడీ గుర్తించింది.
టీటీడీ ఐటీ విభాగం నకిలీ వెబ్ సైట్ ను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా భక్తులు పెద్ద ఎత్తున మోసపోతుండటంతో టీటీడీ నకిలీ వెబ్ సైట్లపై దృష్టి సారించింది. ఏదైతే టీటీడీ వెబ్ సైట్ ఉంటుందో అదే తరహాలో స్వల్ప మార్పులతో భక్తులను నమ్మించే విధంగా నకిలీ వెబ్ సైట్లను సృష్టించి భక్తుల నుంచి లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







