అబుధాబిలో కారు ప్రమాదం..భారతీయ ప్రవాసుడు మృతి

- April 23, 2023 , by Maagulf
అబుధాబిలో కారు ప్రమాదం..భారతీయ ప్రవాసుడు మృతి

యూఏఈ: అబుధాబి అల్ మఫ్రాక్ ప్రాంతంలో జరిగిన ఓ కారు ప్రమాదంలో ప్రవాస భారతీయుడు మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన సుబీష్ చోజియంపరంబత్ 36 ఏళ్లు నిండడానికి సరిగ్గా ఒక నెల ముందు ఏప్రిల్ 20న మరణించాడు. ఇదే ప్రమాదంలో గాయపడ్డ ఒకరు తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరొక వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు సుబీష్ బంధువు వెల్లడించారు. గత రెండేళ్లుగా అబుధాబిలో నివాసముంటున్న సుబీష్ ల్యాండ్‌స్కేపింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో తను పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఈద్ అల్ ఫితర్ సెలవులకు ముందు షాపింగ్ కోసం సుబీష్ ఇతరులతో కలిసి అతను నివసించే అల్ సమ్హా నుండి ముస్సాఫాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com