మెగాస్టార్నే ఢీ కొట్టబోతున్న టిల్లుగాడు.!
- April 24, 2023
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే డేట్కి సందట్లో సడేమియా అంటూ ఓ యంగ్ హీరో కూడా దూసుకొస్తున్నాడు.
ఆయన మరెవరో కాదు.. డీజె టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ. ‘డీజె టిల్లు’తో యూత్లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడీ యంగ్ హీరో. ఈ సినిమాకి సీక్వెల్ రూపొందబోతోందని అప్పుడే తెలుసు. అంతేకాదు, మొదటి పార్ట్కి వచ్చిన క్రేజ్తో అంతకు మించి అనేలా రెండో పార్ట్ని రూపొందిస్తున్నారు.
రాధిక పాత్రలో హీరోయిన్గా నేహా శెట్టి నటించగా, సెకండ్ పార్ట్ కోసం అనుపమా పరమేశ్వరన్ ఎంపికైంది. అనుకున్నట్లుగానే ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా రెండో టిల్లుగాడు రెడీ అవుతున్నాడట.
ఇక, ఈ క్రేజీ మూవీని చిరంజీవికి పోటీగా ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోందట. మెగాస్టార్తో పోటీ అంటే కూసింత ఆలోచించాల్సిందే కానీ, టిల్లుగాడికున్న క్రేజ్తో చిత్ర యూనిట్ ఈ సాహసానికి దిగబోతోందట. చూడాలి మరి, రెండో టిల్లుగాడు ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయనున్నాడో.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







