మెగాస్టార్నే ఢీ కొట్టబోతున్న టిల్లుగాడు.!
- April 24, 2023
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే డేట్కి సందట్లో సడేమియా అంటూ ఓ యంగ్ హీరో కూడా దూసుకొస్తున్నాడు.
ఆయన మరెవరో కాదు.. డీజె టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ. ‘డీజె టిల్లు’తో యూత్లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడీ యంగ్ హీరో. ఈ సినిమాకి సీక్వెల్ రూపొందబోతోందని అప్పుడే తెలుసు. అంతేకాదు, మొదటి పార్ట్కి వచ్చిన క్రేజ్తో అంతకు మించి అనేలా రెండో పార్ట్ని రూపొందిస్తున్నారు.
రాధిక పాత్రలో హీరోయిన్గా నేహా శెట్టి నటించగా, సెకండ్ పార్ట్ కోసం అనుపమా పరమేశ్వరన్ ఎంపికైంది. అనుకున్నట్లుగానే ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా రెండో టిల్లుగాడు రెడీ అవుతున్నాడట.
ఇక, ఈ క్రేజీ మూవీని చిరంజీవికి పోటీగా ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోందట. మెగాస్టార్తో పోటీ అంటే కూసింత ఆలోచించాల్సిందే కానీ, టిల్లుగాడికున్న క్రేజ్తో చిత్ర యూనిట్ ఈ సాహసానికి దిగబోతోందట. చూడాలి మరి, రెండో టిల్లుగాడు ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయనున్నాడో.
తాజా వార్తలు
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- డాలస్లోని మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించిన జయరాం కోమటి
- ఖతార్ లో ఔట్ సైడ్ వర్క్ పై బ్యాన్..కీలక సూచనలు..!!
- గ్లోబల్ ఎక్స్ పోర్టు సఫ్లై చైన్ స్టార్టప్ ఇండెక్స్..ఒమన్ కు ఫస్ట్ ర్యాంక్..!!
- గాయని లక్ష్యంగా..అభ్యంతరకరమైన స్నాప్చాట్ పోస్టులు..కవికి జైలుశిక్ష..!!
- కువైట్ జలాల్లో షార్క్.. ఈపీఏ క్లారిటీ..!!
- షార్జాలో బాలుడు మృతి..సీసీటీవీ ఫుటేజీతో విచారణ వేగవంతం..!!









