ఇండియా-యూఏఈ ట్రావెల్: ఎయిర్ ఇండియా సమ్మర్ ఫ్లైట్ షెడ్యూల్ విడుదల
- April 27, 2023
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా దుబాయ్ కి మరిన్ని నాన్స్టాప్ ఫ్లైట్లను ప్రకటించింది. ఇవి ఢిల్లీ, ముంబై నుంచి నేరుగా నడువనున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లు ప్రస్తుత వేసవి షెడ్యూల్లో భాగంగా ఈ రెండు నగరాల నుంచి రోజువారీ సర్వీసుల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 29 నుంచి ఢిల్లీ, దుబాయ్ మధ్య విమానాలు (రెండు దిశలలో) డైలీ 10 సర్వీసులు.. ముంబై, దుబాయ్ మధ్య ఇప్పుడు రోజువారీగా నడుస్తున్న విమాన సర్వీసుల సంఖ్య 6కు పెరగనున్నాయి. ఎయిర్ ఇండియా సమ్మర్ ఫ్లైట్ షెడ్యూల్ ప్రకారం.. ఇకపై ఇండియా నుంచి దుబాయ్ కి విమాన సర్వీసులు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అందుబాటులో ఉంటాయి. దుబాయ్ రూట్ లో బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ఎయిర్క్రాఫ్ట్ను (బిజినెస్ క్లాస్లో 18 ఫ్లాట్ బెడ్లు, 238 ఎకానమీ క్లాస్ సీట్లు కలిగి ఉంటుంది) రోజువారీ విమాన సర్వీసుల్లో అత్యధిక భాగం కల్పించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్లలో ప్రయాణికులు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.

తాజా వార్తలు
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!
- ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన 22 మంది అరెస్టు..!!
- ఖతార్లో అమల్లోకి వచ్చిన ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!
- ప్రాంతీయ భద్రతపై క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు చర్చలు..!!
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..









