సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలపై జర జాగ్రత్త: యూఏఈ
- April 29, 2023
యూఏఈ: అబుధాబి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం శుక్రవారం సోషల్ మీడియలో మోసం చేసే ప్రకటనలపై నివాసితులను హెచ్చరించింది. క్విక్ లాభాలు, ఆకర్షణీయమైన రాబడి, అధిక రివార్డులను వాగ్దానం చేసే స్కామ్లు ఇటీవల పెరిగినట్లు హెచ్చరించింది. ఆన్లైన్ ప్రకటనల ద్వారా కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత ప్రకటనలకు స్పందించవద్దని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. ఇటువంటి సంస్థలు మోసపూరిత పద్ధతులను ఉపయోగిస్తాయని, సోషల్ మీడియాలో తమను తాము ప్రచారం చేసుకుంటాయని, తప్పుడు ప్రకటనలతో కుచ్చుటోపి పెడతాయని సూచించింది. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి దేశంలోని సంబంధిత అధికారులు జారీ చేసిన సదరు కంపెనీల లైసెన్సులను చెక్ చేయాలని కమ్యూనిటీ సభ్యులను కోరింది. వైర్ మోసం చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని, నేరస్థులకు కఠిన శిక్షలు ఉంటాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఏదైనా మోసపూరిత మార్గాలను ఉపయోగించి ఇతరులను మోసం చేస్తే.. అలాంటి వారికి కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు Dh1,000,000 వరకు జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







