సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలపై జర జాగ్రత్త: యూఏఈ
- April 29, 2023
యూఏఈ: అబుధాబి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం శుక్రవారం సోషల్ మీడియలో మోసం చేసే ప్రకటనలపై నివాసితులను హెచ్చరించింది. క్విక్ లాభాలు, ఆకర్షణీయమైన రాబడి, అధిక రివార్డులను వాగ్దానం చేసే స్కామ్లు ఇటీవల పెరిగినట్లు హెచ్చరించింది. ఆన్లైన్ ప్రకటనల ద్వారా కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత ప్రకటనలకు స్పందించవద్దని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. ఇటువంటి సంస్థలు మోసపూరిత పద్ధతులను ఉపయోగిస్తాయని, సోషల్ మీడియాలో తమను తాము ప్రచారం చేసుకుంటాయని, తప్పుడు ప్రకటనలతో కుచ్చుటోపి పెడతాయని సూచించింది. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి దేశంలోని సంబంధిత అధికారులు జారీ చేసిన సదరు కంపెనీల లైసెన్సులను చెక్ చేయాలని కమ్యూనిటీ సభ్యులను కోరింది. వైర్ మోసం చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని, నేరస్థులకు కఠిన శిక్షలు ఉంటాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఏదైనా మోసపూరిత మార్గాలను ఉపయోగించి ఇతరులను మోసం చేస్తే.. అలాంటి వారికి కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు Dh1,000,000 వరకు జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!
- ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని మోదీ సూచనలు
- భారత నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ









