సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలపై జర జాగ్రత్త: యూఏఈ
- April 29, 2023
యూఏఈ: అబుధాబి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం శుక్రవారం సోషల్ మీడియలో మోసం చేసే ప్రకటనలపై నివాసితులను హెచ్చరించింది. క్విక్ లాభాలు, ఆకర్షణీయమైన రాబడి, అధిక రివార్డులను వాగ్దానం చేసే స్కామ్లు ఇటీవల పెరిగినట్లు హెచ్చరించింది. ఆన్లైన్ ప్రకటనల ద్వారా కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత ప్రకటనలకు స్పందించవద్దని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. ఇటువంటి సంస్థలు మోసపూరిత పద్ధతులను ఉపయోగిస్తాయని, సోషల్ మీడియాలో తమను తాము ప్రచారం చేసుకుంటాయని, తప్పుడు ప్రకటనలతో కుచ్చుటోపి పెడతాయని సూచించింది. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి దేశంలోని సంబంధిత అధికారులు జారీ చేసిన సదరు కంపెనీల లైసెన్సులను చెక్ చేయాలని కమ్యూనిటీ సభ్యులను కోరింది. వైర్ మోసం చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని, నేరస్థులకు కఠిన శిక్షలు ఉంటాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఏదైనా మోసపూరిత మార్గాలను ఉపయోగించి ఇతరులను మోసం చేస్తే.. అలాంటి వారికి కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు Dh1,000,000 వరకు జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









