కోమాలోకి వెళ్లిన 62 సంవత్సరాల వృద్ధురాలు ప్రాణాలను కాపాడిన మెడికవర్ వైద్యులు
- April 29, 2023
హైదరాబాద్: 62 సంవత్సరాల వృద్ధురాలు మెడికవర్ హాస్పిటల్స్ నందు అత్యవసర విభాగానికి ప్రాణాపాయ స్థితిలో రావడం జరిగింది. ఆమెకి రెండు కిడ్నీ లలో ఇన్ఫెక్షన్ మరియు నియంత్రణ లేని డయాబెటిస్ , హై బిపి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు.ఆమెకి ఇన్ఫెక్షన్ ముదిరి రక్తం లో చీము పట్టడంతో బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ అయ్యి, అన్ని అవయవాలు సోకి ప్రమాద స్థితికి చేరుకొని కోమా లోకి వెళ్ళారు. అటువంటి స్థితిలో మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగానికి రావడం జరిగింది.ఎమర్జెన్సీ డాక్టర్ల బృందం సకాలంలో స్పందించారు. అనంతరం డాక్టర్ యూరాలజిస్ట్ డాక్టర్ రవితేజ రామిశెట్టి నేతృత్వంలో పేషెంట్ ని ఇంట్యూబేషన్ చేసి ICU కి తరలించారు.అక్కడ వెంటిలేటర్ మీద చికిత్స అందించడం, కిడ్నీ స్టెంటింగ్ చేసి కిడ్నీ లలో చీము బైటికి తీయడం జరిగింది.ICU వైద్యులు, నర్సింగ్ సిబ్బంది 24x7 అహర్నిశలు శ్రమించి తనకి సరైన వైద్యం చేయడం జరిగింది. పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడిన తర్వాత వెంటిలేటర్ తీయడం జరిగింది. దాదాపు మూడు వారాల చికిత్స అనంతరం తాను ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడటం జరిగింది. తను మామూలుగా మాట్లాడటం ఎంతో సంతోషం కలిగించింది అని డాక్టర్ అన్నారు.
అనంతరం సెంటర్ హెడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన డాక్టర్లచే, 24x7 ఎమర్జెన్సీ సేవలు వల్ల ఇటువంటివి సాద్యపడుతున్నాయి అని అన్నారు.
తాజా వార్తలు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!
- ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని మోదీ సూచనలు
- భారత నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ









