బహ్రెయిన్ సొసైటీ ప్రతినిధులకు బాప్కో ఆతిథ్యం
- May 02, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ (బాప్కో) ఏప్రిల్ 25 నుండి మే 1 వరకు రాజ్యాన్ని సందర్శించిన బహ్రెయిన్ సొసైటీ లండన్ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇచ్చింది. లండన్లోని బహ్రెయిన్ సొసైటీ మునుపటి సంవత్సరాల్లో బహ్రెయిన్ రాజ్యంలో వారి బాల్యం లేదా వారి ఉద్యోగ వృత్తిని గడిపిన బ్రిటిష్ ప్రజలందరినీ ఒకచోట చేర్చింది. బృందంలో చాలా మంది బాప్కో అభివృద్ధిలో వివిధ దశలలో పాల్గొన్న అనుభవం ఉంది. ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 29న కేథడ్రల్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ అరేబియాను సందర్శించి, దాని విలక్షణమైన ఇంజినీరింగ్ డిజైన్.. దానిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.ఆ తర్వాత అవలీ ప్రాంతంలో పర్యటించారు. 1930లలో బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ ప్రారంభమైనప్పటి నుండి దాని చరిత్ర, అవలీ నగరంలో సంవత్సరాలుగా సాగిన అభివృద్ధి దశల గురించి తెలిపే ఒక డాక్యుమెంటరీని తిలకించారు. బహ్రెయిన్, అవలీలో ఉన్న వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ప్రతినిధి బృందం సభ్యులు బాప్కోకు తమ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!









