భారత్ - యూఏఈ మధ్య పెరగనున్న విమాన సర్వీసులు..!
- May 02, 2023
యూఏఈ: భారతదేశ విమానయాన మార్కెట్ భారీగా పెరుగుతుంది. UAE నివాసితులు, భారతీయ పర్యాటకుల నుండి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా భారతదేశం - యూఏఈ మధ్య విమాన సర్వీసులు పెంచాల్సిన అవసరం ఉందని దుబాయ్ ఆధారిత క్యారియర్ ఫ్లైదుబాయ్ CEO ఘైత్ అల్ ఘైత్ తెలిపారు. ఈ మార్గాల్లో వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా దుబాయ్, యూఏఈ మరియు భారతదేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులకు అవకాశం ఉందన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, విమానయాన రంగం బలమైన ఆర్థిక వృద్ధిని పరిగణనలోకి తీసుకుని, ఎయిర్ ఇండియా తన విమానాలను అప్డేట్ చేయడానికి మరియు దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాల కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఎయిర్బస్ , బోయింగ్ నుండి $80 బిలియన్ల విలువైన 470 విమానాలను భారీ ఆర్డర్ చేసిన విషయం తెలిసినదే.
ఏప్రిల్లో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఢిల్లీ , ముంబై నుండి దుబాయ్కి ఎయిర్ ఇండియా అదనపు విమానాలను ప్రకటించింది. యూఏఈ, భారతదేశం మధ్య విమాన సర్వీసుల కొరత కారణంగా, ప్రయాణ సీజన్లలో విమాన ఛార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఎమిరేట్స్లో 3.5 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు పని చేస్తున్నారు. విమాన ఛార్జీలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, వేసవి వరకు ప్రస్తుత స్థాయిలలో కొనసాగే అవకాశం ఉందని ఘైత్ అల్ ఘైత్ చెప్పారు. ఇటీవల ఎమిరేట్స్ ప్రెసిడెంట్ సర్ టిమ్ క్లార్క్ కూడా రెండు దేశాల మధ్య అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను కూడా పెంచాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!









