ఒమన్లో కార్మిక చట్టాల ఉల్లంఘన.. 40 మందికి పైగా అరెస్ట్
- May 02, 2023
మస్కట్: తనిఖీ క్యాంపెయిన్ అది సంధర్భంగా ఒమన్ సుల్తానేట్ అంతటా 40 మందికి పైగా ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. కార్మిక మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ లు సంయుక్తంగా ముత్రాలోని విలాయత్లో తనిఖీ ప్రచారాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 18 మంది కార్మికులను అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన చర్యలకు రిఫర్ చేశారు.
అల్ బురైమి గవర్నరేట్లోని లేబర్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖ, గవర్నరేట్లోని అనేక నాన్-ఒమానీ మ్యాన్పవర్ రిక్రూట్మెంట్ కార్యాలయాలకు క్షేత్ర తనిఖీలను నిర్వహించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖ అల్ అమెరత్లోని విలాయత్, ఖురయ్యత్లోని విలాయత్లో ఒమనీయేతర వర్క్ఫోర్స్చే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఎదుర్కోవడానికి తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది. తనిఖీల సంధర్భంగా 24 మంది కార్మికులను అరెస్టు చేశారు. కార్మిక చట్టంలోని నిబంధనలు మేరకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!









