రెజ్లర్లతో పి.టి. ఉష భేటీ
- May 03, 2023
న్యూఢిల్లీ : రెజ్లర్లతో భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చీఫ్ పి.టి. ఉష భేటీ అయ్యారు. ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేపడుతున్న జంతర్ మంతర్ ప్రాంతానికి బుధవారం పి.టి. ఉష చేరుకున్నారు. వారిని పరామర్శించి.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రెజ్లర్లు క్రమశిక్షణను ఉల్లంఘించారని గతంలో పి.టి. ఉష విమర్శించిన సంగతి తెలిసిందే. క్రీడాకారులు వీధుల్లో నిరసన చేపట్టడం సరికాదని, కమిటీ రిపోర్టు వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందని అన్నారు. ఈ చర్య క్రీడకు, దేశ ప్రతిష్టకు మంచిది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రెజ్లర్లు సహా పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు తమను బాధించాయని రెజ్లర్లు పేర్కొన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ అసోసియేషన్ (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
పి.టి. ఉషతో భేటీ అనంతరం రెజ్లర్ బజరంగ్ పునియా మీడియాతో మాట్లాడారు. రెజ్లర్లకు అండగా నిలబడి న్యాయం చేస్తానని పి.టి. ఉష చెప్పిందన్నారు. తమ సమస్యను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. బ్రిజ్ భూషణ్ జైలుకు వెళ్లేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా బజరంగ్ పునియా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







