రెజ్లర్లతో పి.టి. ఉష భేటీ
- May 03, 2023
న్యూఢిల్లీ : రెజ్లర్లతో భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చీఫ్ పి.టి. ఉష భేటీ అయ్యారు. ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేపడుతున్న జంతర్ మంతర్ ప్రాంతానికి బుధవారం పి.టి. ఉష చేరుకున్నారు. వారిని పరామర్శించి.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రెజ్లర్లు క్రమశిక్షణను ఉల్లంఘించారని గతంలో పి.టి. ఉష విమర్శించిన సంగతి తెలిసిందే. క్రీడాకారులు వీధుల్లో నిరసన చేపట్టడం సరికాదని, కమిటీ రిపోర్టు వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందని అన్నారు. ఈ చర్య క్రీడకు, దేశ ప్రతిష్టకు మంచిది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రెజ్లర్లు సహా పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు తమను బాధించాయని రెజ్లర్లు పేర్కొన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ అసోసియేషన్ (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
పి.టి. ఉషతో భేటీ అనంతరం రెజ్లర్ బజరంగ్ పునియా మీడియాతో మాట్లాడారు. రెజ్లర్లకు అండగా నిలబడి న్యాయం చేస్తానని పి.టి. ఉష చెప్పిందన్నారు. తమ సమస్యను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. బ్రిజ్ భూషణ్ జైలుకు వెళ్లేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా బజరంగ్ పునియా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు









